Varalakshmi Sarath Kumar: అందుకే విలన్ పాత్రలు ఎంచుకున్నా

ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఫిమేల్ విలన్ ఎవరంటే టక్కున చెప్పే పేరు వరలక్ష్మి శరత్ కుమార్. నెగిటివ్ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది వరలక్ష్మి. రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మగా అద్భుతంగా నటించింది. ఈ అమ్మడు ఒకప్పుడు హీరోయిన్ గా తమిళ భాషల్లో సినిమాలు చేసింది.

సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి ప్రస్తుతం విభిన్నమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. క్రాక్ సినిమా తరువాత వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఎన్నో సినిమాల్లో కీలకమైన పాత్రలలో నటించి మెప్పించింది. దీంతో ఈమెకు హీరోయిన్ గా కంటే విలన్ గానే పలు అవకాశాలు వస్తున్నాయి.

ఇటీవల యశోద చిత్రంలో ప్రతినాయక పాత్రలో అలరించిన వరలక్ష్మి.. ప్రస్తుతం వీరసింహారెడ్డిలో బాలకృష్ణతో పోటీ పడబోతోంది. సోషల్ మీడియాలోనూ ఈమె ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాట్లాడుతూ.. తనకు గ్లామర్ పాత్రలు వర్కౌట్ కావని కెరీర్ మొదట్లోనే భావించానని తెలిపింది. ఆ క్యారెక్టర్ చేయడానికి చాలామంది ఉన్నారని పేర్కొంది. అందుకే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తున్నానని చెప్పింది. అప్పట్లో తన గొంతు విని ఇంత బొంగురు గొంతు సినిమాలకు పనికిరాదని చెప్పారట. దాంతో వరలక్ష్మి దానిని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని యాక్టింగ్ మీద దృష్టి పెట్టి ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

- Advertisement -

ఇక ఈ సంక్రాంతి కానుకగా విడుదల కాబోయే బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రంలో వరలక్ష్మి కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో వరలక్ష్మి బాలకృష్ణకి చెల్లెలి పాత్రలో కనిపించబోతుందట. వీరిద్దరి మధ్య చాలా ఎమోషనల్ సీన్స్ ఉంటాయని.. సెంటిమెంట్ సీన్లు కంటతడి పెట్టించేలా డిజైన్ చేశారట డైరెక్టర్. ఈ సినిమాలో ఆమె ఎలా కనిపిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు