Varisu : డబ్బింగ్ సినిమాకే ప్రాధాన్యత

సంక్రాంతి సీజన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి వస్తుంది అంటే ఖచ్చితంగా స్టార్ హీరోల సినిమాలు బాక్సా ఆఫీస్ వద్ద పోటీ పడతాయి. టాలీవుడ్ అగ్ర కథ నాయకుల్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా పోటీ పడుతుంటాయి.అలానే ఈ ఏడాది కూడా రెండు సినిమాలు పోటీ పడనున్నాయి.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాను చేస్తున్నారు. అలానే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ “వీర సింహారెడ్డి” అనే సినిమాను చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.

ఈ రెండు చిత్రాలతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా నటిస్తున్న “వారసుడు” సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది. కానీ ఆశ్చర్యకమైన విషయం ఏంటి అంటే రెండు తెలుగు సినిమాలకంటే ఈ డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా తమిళ్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన వంశి కూడా ఇది పక్కా తమిళ్ ఫిలిం అని తేల్చేసాడు. ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమా అత్యధిక థియేటర్స్ ను దక్కించుకోవడమే కాకుండా విజయాన్ని కూడా సాధిస్తుందా లేదా తెలియాలి అంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు