Dil Raju: అప్పుడు మొగుడు ఇప్పుడు వారసుడు

దిల్ రాజు వేసే ప్లాన్స్ అసలు మాములుగా ఉండవు. కొన్నిసార్లు అంతు చిక్కవు కూడా. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఏమి మాట్లడాలో ఫుల్ క్లారిటీ ఉన్న నిర్మాత. కథలను జడ్జిమెంట్ చేయడంలో మేటి.అందుకే ఆయన బ్యానర్ లో దిల్, ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. సినిమాలను కరక్ట్ సీజన్ లో సినిమాను దించడానికి దిల్ రాజు రెడీగా ఉంటారు.

2023 సంక్రాంతి సీజన్ మొదలవ్వడానికి కొన్ని నెలలు ముందుగానే తను నిర్మిస్తున్నా వారసుడు సినిమాను సంక్రాంతికి విడుదలచేస్తున్నట్లు ఒక క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటాడు దిల్ రాజు. చాలా ఏళ్ళు తరువాత తెలుగులో మల్టి స్టారర్ కి తెర తీసిన “సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు”. ఈ సినిమాను సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలకు కొత్త బాట వేసాడు.

సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,శతమానం భవతి, ఎఫ్2 , సరిలేరు నీకెవ్వరు ఈ సినిమాలన్నీ కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు కూడా వారసుడు సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నాడు దిల్ రాజు. 2020 సంక్రాంతి సీజన్ లో “సరిలేరు నీకెవ్వరు” “అల వైకుంఠపురంలో” సినిమాల మధ్య భారీ పోటీ నడించింది.

- Advertisement -

సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ లో “మాములుగా సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు, కానీ ఈసారి మొగుడొచ్చాడు” అని ప్రకాష్ రాజ్ ఒక డైలాగ్ చెప్తాడు. అలానే అప్పుడు మొగుడులా ఇప్పుడు వారసుడు సినిమాను దించుతున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు