Varun Tej : నాన్నను చూస్తే భయమేస్తోంది… సినిమా ఈవెంట్లో వరుణ్ షాకింగ్ కామెంట్స్

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఓ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో మాట్లాడుతూ తన తండ్రిని చూస్తే భయమేస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇన్నాళ్ళూ సరదాగా ఉన్న ఈ తండ్రి కొడుకులు మధ్య అంతగా ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళ్తే…

పరువు సిరీస్ ఫ్రీ లాంచ్ ఈవెంట్

నాగబాబు, నివేదా పెతురాజ్, నరేష్ అగస్త్య, బిందు మాధవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన జీ5 ఒరిజినల్ సిరీస్ పరువు. వడ్లపాటి రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సిరీస్ జూన్ 14 నుంచి జీ5లో ప్రసారం కాబోతోంది. సినిమాకు సంబంధించిన ప్రీ లాంచ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. అందులో భాగంగా వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను అతిథిగా ఆహ్వానించి మొదటి ఎపిసోడ్ ను చూపించారు. అనంతరం వరుణ్ తేజ్ మాట్లాడుతూ తండ్రి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తండ్రిపై వరుణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ముందుగా వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ తమ ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ ఎపిసోడ్ చూసామని వరుణ్ వెల్లడించారు. అయితే థియేటర్, ఓటిటి ఇలా వేదిక ఏదైనా కాన్సెప్ట్ మంచిదైతే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని, ఈ వెబ్ సిరీస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని కామెంట్స్ చేశారు. ఇక ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందా అనిపించిందని, పేరుపేరునా టెక్నీషియన్స్ ని పొగడ్తలతో ముంచేశారు. మ్యూజిక్, కెమెరా వర్క్ బాగుందని చెప్పిన వరుణ్ విప్లవ్ ఎడిటింగ్ కూడా హైలెట్ అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత షో రైటర్, డైరెక్టర్ ల పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా పవన్ కు కంగ్రాట్స్ తెలుపుతూ షో రన్నర్ పవన్ సాదినేని అద్భుతమైన దర్శకుడు అని అన్నారు వరుణ్.

- Advertisement -

YSRCP Is After Nagendra Babu and His Son Varun Tej!

అంతేకాకుండా సినిమాలో నటీనటులంతా అద్భుతంగా నటించారని, ముఖ్యంగా తండ్రిని పోస్టర్లో చూస్తే భయం వేసిందని చెప్పారు వరుణ్. ఆ తర్వాత మా హనీ అక్క కోసమే ఇక్కడికి వచ్చానని, ఆమె తమ దగ్గర ఎప్పుడూ అవకాశాల కోసం అడ్వాంటేజ్ తీసుకోలేదని, సొంతంగా తన బ్రాండ్ ని బిల్డ్ చేసుకోవడం చూస్తే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సిరీస్ విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ సిరీస్ రిలీజ్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సిరీస్ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. పరువు హత్యల నేపథ్యంలో సాగిన ఈ వెబ్ సిరీస్ కు వీక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మేకర్స్ మాత్రం ఈ సిరీస్ తప్పకుండా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు.

వరుణ్ సినిమాలు..

రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న వరుణ్ ఇప్పుడు మట్కా అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే తనకు బాగా కలిసి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్3 సీక్వెల్ ఎఫ్4 కు కూడా రెడీ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు