Vedhika: యక్షిణి కోసం ఇంత కష్టపడ్డదా.. వీడియో వైరల్..!

Vedhika..కరోనా వచ్చినప్పటి నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. చాలామంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ల వల్లే మంచి పాపులారిటీ కూడా సంపాదించుకున్నారు. దీంతో దాదాపుగా రెండు మూడేళ్ల నుంచి ఓటీటీ వేదికలకు హైప్ భారీగానే కొనసాగుతోంది. కొన్ని సినిమాలు , వెబ్ సిరీస్ లు సైతం ఎక్కువగా ఓటీటీ లోనే దూసుకుపోతున్నాయి. తాజాగా ఇటీవలే ప్రముఖ ఓటీటీ ఛానల్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో దూసుకుపోతున్న వెబ్ సిరీస్ లలో యక్షిణి కూడా ఒకటి. ఇందులో మంచు లక్ష్మీ తోపాటు హీరోయిన్ వేదిక కూడా కలిసి నటించారు.

మాయ యక్షిణి గా విశ్వరూపం చూపించిన వేదిక..

Vedhika: Did she work so hard for Yakshini.. Video viral..!
Vedhika: Did she work so hard for Yakshini.. Video viral..!

ఈ వెబ్ సిరీస్ పై ఆడియన్స్ నుంచీ పాజిటివ్ రివ్యూ కూడా రావడం జరిగింది. కంటెంట్ మాత్రమే కాదు ఇందులోని పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో యక్షిణి పాత్రలో నటించిన వేదిక నటనకు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.. మనిషి రూపంలో కనిపిస్తూ.. శాపానికి విరుగుడు కోసం ప్రయత్నిస్తున్న ఒక మాయ యక్షిణి పాత్రలో అద్భుతంగా నటించింది. ముఖ్యంగా రొమాన్స్ సన్నివేశాలలో కూడా నటించి తనలోని నట విశ్వరూపాన్ని చూపించింది వేదిక. చాలా కాలం గ్యాప్ తర్వాత యక్షిణి సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వేదిక.

మేకప్ కోసం ఐదు గంటల సమయం..

తాజాగా ఈ వెబ్ సిరీస్ కోసం వేదిక కష్టపడిన ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఈ వీడియో చూసిన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా యక్షిణి వెబ్ సిరీస్ కోసం వేదిక పడిన కష్టాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు నెటిజన్స్. కేవలం మేకప్ కోసమే సుమారుగా ఐదు గంటలకు పైగా సమయం పడుతున్నట్లుగా తెలియజేసింది. ఈమె డెడికేషన్ కి అభిమానులు, నెటిజెన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. యక్షిణిగా మారేందుకు.. మేకప్ వేయడానికి సుమారు మూడు గంటల సమయం పట్టేదని.. అంతేకాదు ఆ మేకప్ తీయడానికి సుమారుగా రెండు గంటల సమయం కూడా పట్టేదని తెలియజేసింది.

- Advertisement -

కష్టం వృధా పోలేదు..

దీన్ని బట్టి చూస్తే మొత్తానికి వేదిక యక్షిణిగా కనిపించడానికి ఐదు గంటలు తీసుకునేది.. అంత మేకప్ చేయడానికి టీం కూడా చాలా కష్టపడినట్లుగా ఈ వీడియోలో తెలియజేసింది వేదిక.. వేదిక కష్టానికి తగిన ఫలితం కూడా లభించింది.. ఈ వెబ్ సిరీస్ టాప్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ తేజ మర్ని ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. యక్షిణి వెబ్ సిరీస్ లో.. యక్షిణి గా వేదిక.. మంచు లక్ష్మి జ్వాలముఖిగా.. అలాగే రాహుల్ విజయ్, అజయ్ తదితరులు ఇందులో నటించారు. గతంలో డైరెక్టర్ తేజ మర్ని.. కోటబొమ్మాలి, జోహార్ తదితర చిత్రాలను తెరకెక్కించారు. యక్షిణి అనే వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు ఇందులో నటించిన నటీనటుల కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించిందని చెప్పవచ్చు ఇక తాజాగా ఈ నేపథ్యంలోని ఈ విషయాలను అభిమానులకు తెలియజేస్తూ వేదిక షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

 

View this post on Instagram

 

A post shared by Vedhika (@vedhika4u)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు