Venuswamy: మరో 6 నెలల్లో టాలీవుడ్ హీరోయిన్ విడాకుల బాట.. బాంబు పేల్చిన వేణు స్వామి..!

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి రెండు సంవత్సరాలుగా భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎప్పుడైతే అక్కినేని కోడలు సమంత , వారి వారసుడు నాగచైతన్య విడిపోతారని చెప్పారో, అప్పటినుంచి వైరల్ గా మారిన వేణు స్వామి, ఈయన చెప్పినట్టుగానే వారిద్దరూ విడాకులు తీసుకోవడంతో మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వేణు స్వామి చెప్పే మాటలు నిజమవుతున్నాయని చాలామంది సెలబ్రిటీలే కాదు అభిమానులు, ప్రేక్షకులు కూడా నమ్మారు. అందులో భాగంగానే సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను బయట పెడుతూ వైరల్ అవుతున్న వేణు స్వామి సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలపై ఖచ్చితంగా చెబుతున్నారు.

Venuswamy: Divorce of Tollywood heroine in next 6 months.. Venu Swamy who exploded the bomb..!
Venuswamy: Divorce of Tollywood heroine in next 6 months.. Venu Swamy who exploded the bomb..!

రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలలో విమర్శలు..

కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలు మాత్రం బొక్క బోర్లు పడుతున్నాయని చెప్పాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి ఘోరంగా పరాభవం అవుతుందని చెప్పిన ఈయన.. ఊహించని విధంగా 164 సీట్లు కైవసం చేసుకుంది కూటమి . అలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు అని, రేవంత్ రెడ్డి ఊడ్చుకుపెట్టుకుపోతాడని కామెంట్లు చేశారు.. కానీ రేవంత్ రెడ్డి రెట్టింపు వేగంతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. ఈ విషయాలలో ఈయన పూర్తిస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.

వేణు స్వామి తో పూజలు..

ఇకపోతే సెలబ్రిటీల విషయానికి వస్తే..సినిమా వాళ్లు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంటున్నారు. అలాగే స్టార్ హీరోల ఆరోగ్యం పై కూడా ఈయన కామెంట్స్ చేశారు. అంతేకాదు ప్రభాస్ ఇకపై హిట్స్ అందుకోలేడని చెప్పారు. కానీ ప్రభాస్ కల్కి, సలార్ సినిమాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. పైగా వేణు స్వామి తో రష్మిక మందన్న, డింపుల్ హయతి , నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లను మొదలుకొని అషు రెడ్డి , ఇనయా సుల్తానా లాంటి బుల్లితెర నటీమణులు వరకు స్పెషల్ పూజలు చేశారు. అంతేకాదు సీనియర్ స్టార్ హీరోయిన్ లైన నయనతార , రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు వివాహం చేసుకుంటే వైవాహిక బంధం లో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.. ఇక ఈయన చెప్పినట్టుగానే అటు నయనతార , ఇటు రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు కూడా పలు సమస్యలను చవిచూస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

మరో ఆరు నెలల్లో టాలీవుడ్ హీరోయిన్ విడాకులు..

ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆరు నెలల్లో టాలీవుడ్ హీరోయిన్ విడాకుల దిశగా అడుగులు వేయబోతోందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానిని ఈమె ప్రేమించి వాహనం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట చాలా హ్యాపీగానే ఉంది. కానీ ఈ జంట గురించి వేణు స్వామి సంచలన ఆరోపణలు చేశారు .ఆమె భర్త నష్టపోతాడని , ఈమె ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పాడు.. దీనిపై కూడా ఆయన వివరణ ఇస్తూ నేను చెప్పినట్టుగానే ఈమె భర్త నష్టపోయాడు.. దాదాపు రూ.500 కోట్లు నష్టం చవిచూడాల్సి వచ్చింది. నాకు తెలిసి మరో ఆరు నెలల్లో వీరు విడాకులు తీసుకుంటారు. అది జరుగుతుంది. అది జరిగితే నాపై ట్రోల్స్ చేసిన వారిని చెప్పుతో కొట్టినట్టే అవుతుందని సంచలన కామెంట్లు చేశారు. ముఖ్యంగా తనపై వచ్చే రూమర్స్ పట్టించుకోనని, కానీ తాను చెప్పే వాటిలో 90% నిజమయ్యాయని, కానీ కొంతమంది కావాలనే తనను ట్రోల్ చేస్తున్నారు అని చెప్పారు. మొత్తానికైతే రకుల్ పెళ్లి , విడాకులపై షాకింగ్ కామెంట్లు చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు