VenuSwamy -VeenaSrivani : మేము చచ్చినా పర్లేదు.. ఇదే మా ఆఖరి వీడియో.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..

VenuSwamy -VeenaSrivani : టాలీవుడ్ లో సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ ఫేమస్ అయిన వేణు స్వామి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడన్న విషయం తెలిసిందే. నాగ చైతన్య ఎంగేజ్మెంట్ నుండి పీక్స్ కి చేరిన ఈ గొడవ నేడు అన్ని రకాల వ్యక్తులు టార్గెట్ చేసే విధంగా మారింది. కొన్ని రోజులుగా మీడియా నుండి కూడా వేణు స్వామిపై విమర్శలు వస్తుండగా, ఆ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇక వేణు స్వామికి సపోర్ట్ గా అతని భార్య వీణ శ్రీవాణి కూడా వంత పాడుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ సంచలన వీడియో పోస్ట్ చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు. మీడియాని టార్గెట్ చేస్తూ, ప్రముఖ జర్నలిస్ట్ లు తమను 5 కోట్లు డిమాండ్ చేసారంటూ.. ఆ జర్నలిస్ట్ వల్ల తాము సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.

VenuSwamy -VeenaSrivani Sensational Video Viral

వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు.. – వేణు స్వామి

ఇక వేణు స్వామి రిలీజ్ చేసిన వీడియో లో.. తన భార్య వీణ తో కలిసి మాట్లాడుతూ.. ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఫేమస్ అయిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ తమను 2017 నుండి వేధిస్తున్నారంటూ… డబ్బులు ఇచ్చి.. కొంతమంది జ్యోతిష్యులను తీసుకుని వచ్చి తనకు వ్యతిరేకంగా టీవీలో డిబేట్లు కూడా పెడుతున్నారంటూ వేణు స్వామి చెప్పుకొచ్చాడు. చాలా మంది కష్టాలను తొలగించిన నన్ను… ఈరోజు ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చేలా చేసారు. నా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారంటూ… వేణు స్వామి చెప్పుకొచ్చాడు. దీనంతటికి కారణం చూడండంటూ ఓ ఆడియో కూడా రిలీజ్ చేసారు. అమర్ అనే వ్యక్తితో ఓ మీడియా జర్నలిస్ట్, వేణుస్వామి భార్య వీణావాణికి 5 కోట్లు డిమాండ్ చేయించినట్టుగా ఆ ఆడియోలో ఉంది.

- Advertisement -

లెక్కలన్నీ రెడీ గా ఉంన్నాయి – వీణావాణి

అయితే ఆ ఆడియో లో వీణావాణి మాట్లాడిన తీరు చూస్తుంటే 5 కోట్ల మాట నమ్మశక్యంగా లేదని అనిపిస్తుంది. ఈ మాట పక్కనబెడితే.. వీణావాణి మాట్లాడుతూ.. అసలు 5 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు కదా.. అంత అమౌంట్ ఏ లెక్కలో అడిగారు అని మాకే షాకింగ్ గా ఉంది. ఆ ఫిగర్ వినగానే నా మైండ్ బ్లాక్ అయ్యిందని, ఏం చేద్దాం..మా ఆయన దగ్గర ఐదు కోట్లు అయితే లేవు… అంటూ వీణ ఆ విడియోలో మరికొందరి ప్రముఖ జర్నలిస్ట్‌ల పేర్లు కూడా వినిపించారు. అయితే తమపై పర్సనల్ గా దాడికి దిగుతున్న ఈ జర్నలిస్ట్ లపై ప్రతి దాడికి, మేము రెడీ అంటూ.. మమ్మల్ని బతకానిస్తే ఇంకా సాక్ష్యాలు బయట పెడతామంటూ.. వీణ చెప్పుకొచ్చారు.

అయితే ఆ మధ్య వేణు స్వామి నాగ చైతన్య – శోభితపై చేసిన వీడియోకు, అలాగే మరికొన్ని వీడియోలకు ఫిల్మ్ ఛాంబర్ నుండి కొందరు మీడియా జర్నలిస్ట్ లు వెళ్లి ‘మహిళా కమీషన్‌’ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు ఎవరైతే ప్రముఖ జర్నలిస్ట్‌లు వెళ్లి వేణు స్వామిపై కంప్లైంట్ చేసారో వాళ్లపైనే ఈ వీడియో చేసినట్టు, వాళ్ళ పేర్లే ఈ వీడియోలో చెప్తున్నట్టు ఉందని, ఇదేదో రివెంజ్ డ్రామాలా ఉందని నెటిజన్లు అంటున్నారు. మరి దీనిపై మరిన్ని వివరాలు ట్రావెల్స్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు