Shalini Pandey: బాయ్స్‌ రూంలో అడ్డంగా దొరికిపోయిన అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌..!

Shalini Pandey: శాలిని పాండే ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి హీరోయిన్ అంటే మాత్రంటక్కున ప్రతి ఒక్క పేక్షకుడు గుర్తుపడతారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరయింది శాలిని. ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పవచ్చు.

అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు విజయ్. కానీ ఈ సినిమాలో నటించిన శాలినీకి మాత్రం…. ఈ సినిమా అనంతరం పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో అవకాశాల కోసం ఇప్పటికి ఎదురు చూస్తూనే ఉంది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విపరీతంగా సినిమా అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ రివర్స్ అయింది. ఒకటి రెండు చిత్రాలలో మాత్రమే నటించి ఆ తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. ఇప్పుడు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రేక్షకులను అందిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. తన కెరీర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. నా కెరీర్ బిగినింగ్ లో నేను బాడీ షేమింగ్ కి గురయ్యానని….. శాలిని పాండే చెప్పుకొచ్చింది. నా బాడీ గురించి, నా కలర్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడేవారు. వారు అలా మాట్లాడిన సమయంలో నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని. దీంతో నా మాజీ మేనేజర్ నన్ను మోసం చేశాడు. నా కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మా నాన్న నన్ను ఇంజనీరింగ్ చేయమన్నారు. కానీ నాకు నటనపై ఆసక్తితో నటిని అవుతానని చెబితే ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు.

- Advertisement -

మా నాన్న కోరిక ప్రకారం ఇంజనీరింగ్ పూర్తి చేయడానికి ప్రయత్నించా. కానీ అది కుదరలేదు. నటిని అవుతానని ఇంట్లో ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ అది కూడా జరగలేదు. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి ముంబై వచ్చేసాను. అక్కడ నా స్నేహితురాలు సహాయం చేసింది. కానీ కొన్ని సమస్యల కారణంగా వారితో నేను ఉండలేకపోయాను. చివరికి కొంత మంది అబ్బాయిలు ఉంటున్న రూమ్ ని షేర్ చేసుకున్నాను. వారు చాలా మంచి వాళ్ళు. తక్కువ సమయంలోనే వారు నా ఫ్యామిలీలా కలిసిపోయారు అని శాలిని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శాలిని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు