Vijayendra Prasad : బేబి సినిమా గురించి ట్రిపుల్ ఆర్ రైటర్ రెస్పాన్స్

Vijayendra Prasad : హృదయ కాలేయం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సాయి రాజేష్. కానీ పేరు మాత్రం సాయి రాజేష్ అని వేసుకోలేదు. ఎందుకంటే సాయి రాజేష్ కి కావలసిన గుర్తింపు అది కాదు. తాను ఎలాంటి సినిమా తీయాలో తనకి ఒక క్లారిటీ ఉంది. అందుకోసమే తను చేసిన మొదటి రెండు సినిమాలు కూడా తన అసలైన పేరును వేసుకోలేదు. ఇంకా సాయి రాజేష్ చేసిన సినిమా బేబీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 50 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా.

బేబీ సినిమా ప్రభంజనం

ఆనంద్ దేవరకొండ వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమాకి విజయ్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని పాటలు ఎంత అద్భుతంగా హిట్ అయ్యాయో మనకు తెలియదు కాదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా పైన అంచనాలు పెంచిందే ఈ పాటలు. అయితే ఈ సినిమాని మొదటి ప్రీమియర్స్ వేశారు అయితే ఈ సినిమాకి సంబంధించి కొంతమంది ఇది ఒక నిభాన్ని ఈ స్టోరీ అంటూ కామెంట్స్ కూడా చేశారు. అయితే వీటిలో కొన్నిటికి సాయి రాజేష్ స్పందిస్తూ ఒక రెండు రోజులు ఆగితే సినిమా ఫలితం ఏంటో తెలుస్తుంది అని చెప్పుకొచ్చాడు. అయితే సాయి రాజేష్ చెప్పినట్లు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించి కొన్ని కోట్లను వసూలు చేసింది.

Baby Telugu movie

- Advertisement -

యదార్థ సంఘటనకు ఆధారంగా

ఈ సినిమాకి సంబంధించి ఒక యదార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ కథను సాయి రాజేష్ రాసుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి సాయి రాజేష్ కన్వే చేయాలనుకున్న పాయింట్ ఒకటి, ఆడియన్స్ కి కన్వే అయిన పాయింట్ ఇంకోటి. ఏదేమైనా కూడా ఈ సినిమా ఫైనల్ గా విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం వైష్ణవి దిల్ రాజు ప్రొడక్షన్స్ లో లవ్ మీ అనే సినిమాను చేస్తుంది.

నిర్మాతకు కాసులు వర్షం

ఈ సినిమాకి ఎస్ కే ఎన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం తను కొనుగోలు చేసిన ఇంటిని కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చారు.. ఇకపోతే ఎంతో నమ్మిన ఈ ప్రాజెక్టు నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అత్యధిక లాభాలను తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో పడగానే ఒక కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాను అందించమంటూ చెప్పుకొచ్చాడు ఎస్ కే ఎన్.

ట్రిపుల్ ఆర్ రైటర్ ప్రశంసలు

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా గం గం గణేశా. ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ప్రముఖ రైటర్ విజయేంద్రప్రసాద్ హాజరయ్యారు. అయితే అక్కడున్న సాయి రాజేష్ ను ప్రశంసిస్తూ మూడు రోజుల క్రితమే బేబీ సినిమా చూశానని చెప్పి తనకు ఆ సినిమా చాలా బాగా నచ్చిందని ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసారని చెప్పి ప్రశంసలు కురిపించారు. బేబీ సినిమా నచ్చని వాళ్ళు కొంతమంది అంత పెద్ద రైటర్ కి ఆ నిబ్బా నిబ్బీ స్టోరీ ఎలా నచ్చింది అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు