Allu Aravindh : ఆయ్ సినిమా గురించి ఎన్టీఆర్ కి ఫోన్ చేస్తే ఏమన్నాడంటే

Allu Aravindh: మ్యాడ్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు నర్నే నితిన్. మొదటి సినిమాతోనే మంచి కుటుంబం సాధించుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే నీ నితిన్ ఎన్టీఆర్ కి స్వయానా బావమరిది అవుతాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నితిన్ ఆయ్ ఒక సినిమాను చేస్తున్నాడు. సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నితిన్ కనిపిస్తున్నాడు. నలుగురు హీరోలు ఉన్న ఈ కథ కోసం పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కదా ఒకసారి ఈ సినిమాలో నలుగురు హీరోలు ఉంటారు అని ఎన్టీఆర్ కు ఇన్ఫామ్ చేయడానికి అల్లు అరవింద్ ఫోన్ చేశారట. అయితే ఫోన్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… సర్ ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా, మనం కేవలం ఇంట్రడ్యూస్ చేయడం వరకే ఆ తర్వాత వాళ్ళ టాలెంట్ వలన వాళ్ళు పైకి వస్తారు. ఏదైనా ఫస్ట్ షో టికెట్ పడటం కోసమే మనం ప్రయత్నం తర్వాత అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కథ బాగుంటే చాలు పాత్రది ఏముంది అంటూ మాట్లాడారు ఎన్టీఆర్ అంటూ చెప్పుకొచ్చారు.

AAY

- Advertisement -

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది వారసులు ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు. కొంతమంది ఎంట్రీ కూడా ఇచ్చారు అయితే వాళ్ళు ప్రూవ్ చేసుకొని హీరోలుగాను నటులుగాను కొనసాగిన వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పాలి. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే చాలామంది ప్రూవ్ చేసుకొని ఎప్పటికీ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా వారసత్వం అనేది కేవలం ఓపెనింగ్స్ పనికొస్తుంది తప్ప ఇక్కడే సెటిల్ అవ్వడానికి ఏ మాత్రం ఉపయోగపడదు. టాలెంట్ ఉంటే ఎవరినైనా తెలుగు ప్రేక్షకులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు