Double Ismart : చిక్కుల్లో ఛార్మీ పూరి… ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీ రిలీజ్‌ కాకుండానే పోతుందా..?

Double Ismart : ప్రస్తుతం టాలీవుడ్ లో ఆగస్టు 15 న విడుదల అవుతున్న సినిమాలపై ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంది. కల్కి తర్వాత రాబోతున్న స్టార్ హీరోల సినిమాలు కావడంతో వీటి పై ఇండస్ట్రీలో పాటుగా సినీ అభిమానుల్లో కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఆ డేట్ న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. అయితే మిస్టర్ బచ్చన్ సినిమా పక్కన పెడితే రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ విడుదల పై ఇంకా సందేహాలు తీరలేదు. డేట్ ను ముందుగానే ప్రకటించిన కూడా విడుదల పై జనాల్లో సంధిగ్దత కొనసాగుతుంది.. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.. అవేంటంటే..

ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు..

మరో ఐదు రోజుల్లో సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్స్ చెయ్యలేదు.. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ఉన్న బజ్ దీనికి లేదు. అప్పుడు ఓ రేంజులో ప్రమోషన్స్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం పెద్దగా సినిమాను ప్రమోట్ చెయ్యలేదు. సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ తప్ప ప్రత్యేకంగా జనాలకు రీచ్ అయ్యేలా ఏది చెయ్యలేదు మేకర్స్..

Will the release of Double Smart movie stop because of that problem?
Will the release of Double Smart movie stop because of that problem?

హీరో, డైరెక్టర్ మధ్య గొడవలు..

డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని మధ్య సినిమా షూటింగ్ టైం లో గొడవలు జరిగాయని వార్తలు వినిపిస్తున్నాయి. దానివల్లే ప్రమోషన్స్ లో స్పీడును పెంచలేదని టాక్. అంతేకాదు సైలెంట్ గా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. గత కొన్ని రోజులుగా దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు విడుదల అవ్వదనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

లైగర్ డిస్టిబ్యూటర్స్ వివాదం..

ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి తెరకేక్కించిన సినిమా లైగర్.. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేశారు. కానీ మూవీ భారీ డిజాస్టర్ గా మారింది. ఈ సినిమా విషయంలో తీవ్ర నష్టాన్ని కలిగించిందని ఆ డిస్టిబ్యూటర్స్ గొడవలు చేస్తున్న సంగతి తెలిసిందే.. దీంతో రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ కు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. పూరి జగన్నాధ్ గత చిత్రం లైగర్ సినిమా నష్టాలకు సంబంధించి పంచాయితీ తేల్చేందుకు సిటింగ్స్ మీద సిట్టింగ్స్ వేస్తున్నారు.. లైగర్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తనకు రావాల్సిన నష్ట పరిహారం విషయాన్ని తేల్చి అప్పుడు రిలీజ్ చేసుకోమని చెప్పేసాడు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ తమ సమస్య విషయం సీరియస్ గా తీసుకోకుండా డబుల్ ఇస్మార్ట్ ను రిలీజ్ చేయాలని చుస్తే మాత్రం ఊరుకునేది లేదు.. అవసరమైతే ఈ నెల 15 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని చెబుతున్నారు. ఆ విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని నైఙాం ఎగ్ఙిబిటర్ల ఆలోచన చేస్తున్నారు.. ఈ విషయం వాళ్లు సీరియస్ గా ఉండటంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ఏ విషయం తేలకుంటే మాత్రం సినిమా ఖచ్చితంగా వాయిదా పడుతుందని సమాచారం. మరి దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ రాబోతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు