Yash: టాక్సిక్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ బ్యూటీస్.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా..!

Yash.. కేజీఫ్ సినిమాలతో ప్రభంజనం సృష్టించిన స్టార్ హిరో యష్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోగా పేరు సంపాదించారు.. తెలుగులో కూడా భారీగానే ఫ్యాన్ బేస్ కలిగివున్న హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం కే జి ఎఫ్-3 కోసం అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతమైతే హీరో యష్ టాక్సిక్ అనే చిత్రం మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు.

Yash: Bollywood beauties who are queuing up for Toxic.. Now another heroine too..!
Yash: Bollywood beauties who are queuing up for Toxic.. Now another heroine too..!

సెకండ్ హీరోయిన్ గా తారా సుతారయా..

ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తూ ఉండగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేసే విధంగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పటివరకు ఇందులో యష్ కు జోడిగా ఎవరు నటిస్తారనే విషయం పైన చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. కానీ పలు రకాల వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి తారా సుతారియా నటిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈమె గతంలో తడప్, హీరో పంతి -2 వంటి చిత్రాలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు యష్ కు జోడిగా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నెగిటివ్ పాత్రలో హుమా ఖురేషి..

టాక్సిక్ లో మొదటి గర్ల్ ఫ్రెండ్ గా కియారా అద్వానీ నటిస్తుందని. తార రెండవ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. యష్ సినిమాలో నటించడం ఈమెకు ఒక చక్కటి అవకాశం అని కూడా చెప్పవచ్చు. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కాబట్టి , ఈమె తెరకెక్కించే సినిమాలలో ఎక్కువగా పాత్రలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.. అందుకే చాలామంది సెలబ్రిటీలను ఈ సినిమాలలో నటించే విధంగా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ గీతూ. అలాగే ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో హుమా ఖురేషి కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఈమె నెగటివ్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

యష్ కి చెల్లిగా నయనతార..

వీరే కాకుండా సౌత్ లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార యష్ చెల్లెలి పాత్రలో టాక్సిక్ సినిమాలో కనిపించబోతోందని సమాచారం. నయనతార ఇప్పటికే చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు మరొకసారి యష్ కి చెల్లెలిగా నటించబోతోంది . వాస్తవానికి ఈ పాత్ర కోసం ముందుగా కరీనాకపూర్ ని అనుకోగా, ఆమె కొన్ని కారణాల చేత ఈ పాత్రను ఒప్పుకోకపోవడంతో ఈమె ప్లేస్ లో నయనతార ను తీసుకువచ్చినట్లు సమాచారం.. ఈ సినిమా కథ మొత్తం 1950-1970 మధ్యకాలంలో జరిగేటువంటి కథ అన్నట్లుగా తెలుస్తోంది అప్పట్లో డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమా షూటింగ్స్ సెప్టెంబర్ లో పట్టాలెక్కనున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటున్న అని వార్తలు వైరల్ అవుతున్నాయి

.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు