Bigg Boss Telugu Season 8 : హౌజ్ లో కపుల్స్ కు ఆ స్పెషల్ అడ్వాంటేజ్… ఇదెక్కడి అరాచకం బిగ్ బాస్

Bigg Boss Telugu Season 8 : త్వరలోనే తెరపైకి రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. కొత్త సీజన్లో ఈ రియాలిటీ గేమ్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అని బుల్లితెర ప్రేక్షకులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు ఎనిమిదవ సీజన్లోకి అడుగు పెడుతుండడంతో, ఈసారి ఎలాంటి స్పెషలిటీస్ ఉండబోతున్నాయి అనే విషయంపై ఆసక్తి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఇద్దరు కపుల్స్ అడుగు పెట్టబోతున్నారని, హౌస్ లో వాళ్ళకు స్పెషల్ అడ్వాంటేజ్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

హౌస్ లోకి ఇద్దరు కపుల్స్…

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో పాల్గొనబోయేది వీళ్లేనంటూ పలువురు కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో రీతు చౌదరి, వర్షిని లాంటి హాట్ బ్యూటీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వేణు స్వామి, బర్రెలక్క, బంచిక్ బబ్లు, సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత, హేమ, కిరాక్ ఆర్పి, కుమారి ఆంటీ, అమృత ప్రణయ్, బుల్లెట్ భాస్కర్ తో పాటు పలువురు బుల్లితెర ప్రముఖులు కూడా సీజన్ 8లో పాల్గొనబోతున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఈ షోకు సంబంధించి ప్రస్తుతం ప్రేక్షకులకు బిగ్ బాస్ మేకర్స్ ఈసారి పలు సర్ప్రైజ్ లను ఇవ్వబోతున్నారని సమాచారం.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8లో టీమిండియా క్రికెటర్.. స్కెచ్ మాములుగా లేదుగా - Telugu News | Bigg Boss Telugu Season 8: Cricketer Ambati Rayudu To Participate In Nagarjuna Hosted Show | TV9 Telugu

- Advertisement -

అందులో ఒకటి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న కపుల్స్ కి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేయబోతున్నారట. అంటే కపుల్ అనగానే ముద్దు ముచ్చట్లు ఉంటాయి. కాబట్టి వాళ్ల కోసం సపరేట్ గా ఇలా రూములు ఏర్పాటు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇద్దరు జంటలకు కూడా వేరువేరు రూమ్స్ ఏర్పాటు చేయడంతో ఈసారి రచ్చ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అనిపిస్తోంది. కానీ సాధారణంగానే బిగ్ బాస్ షో అంటే కొంతమందికి నచ్చదు. ప్రతిసారీ షో స్టార్ట్ ఆయేముందు ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. అయినప్పటికీ నిర్వాహకులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా షోను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. కానీ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి వివాదానికి దారి తీస్తుందో చూడాలి.

హౌస్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కపుల్ వీళ్లే

బిగ్ బాస్ 3 లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి కపుల్ వరుణ్ సందేశ్, వితిక షేరు. 2019లో ఈ రియాల్టీ షోలో అడుగుపెట్టిన వరుణ్ సందేశ్ చివరి వరకు ఆటను ఇంటరెస్టింగ్ గా ఆడారు. ఫైనల్ కంటెస్టెంట్స్ లో నాలుగో స్థానంలో నిలిచారు. ఇక ఆ తర్వాత మెరీనా, రోహిత్ దంపతులు కూడా హౌస్ లోకి అడుగుపెట్టి ఆకట్టుకున్నారు. మరి ఇప్పుడు అంటే ఎనిమిదవ సీజన్లో అడుగుపెట్టబోయే ఆ రెండు జంటలు ఎవరు? అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అలాగే బిగ్ బాస్ 8వ సీజన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అన్నది కూడా తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు