బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం బ్రహ్మాస్త్ర. దాదాపు వరుస డిజాస్టర్లతో విలవిలలాడుతున్న నిర్మాతలకు ఈ సినిమాల కలెక్షన్లు మళ్లీ కొత్త ఆశలను కల్పించింది. ఈ చిత్రం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియాభట్ నటించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అమితాబ్, నాగార్జున, షారూఖ్ఖాన్, మౌనిరాయ్ కీలకపాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే బాయ్కాట్ సెగ తగిలింది. తొలివారం మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రెండో వారం నుంచి మెల్లగా పుంజుకొని విడుదలైన 14 రోజుల్లోనే రూ.400 కోట్ల క్లబ్లో చేరింది.
మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద విజువల్ వండర్గా నిలిచింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్గా దూసుకుపోతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా బ్రహాస్త్ర ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ లో దీపావళి సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చిత్ర యూనిట్ అధికారికంగా ఓటీటీ విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కూడా ప్రారంభిస్తారట. రణబీర్ కపూర్ ప్రస్తుతం యానిమల్ సినిమాలో నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2లో హృతిక్ రోషన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు టాక్ వినిపిస్తోంది. బ్రహ్మాస్త్ర దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలవుతుందా లేదా అనేది వేచి చూడాలి.