Janhvi Kapoor : మిస్టర్ అండ్ మిస్ మహి వచ్చేసారు, అప్పుడు మిస్ అయినవాళ్ళు ఇప్పుడు చూడొచ్చు

Janhvi Kapoor : జాన్వి కపూర్ శ్రీదేవి కూతురుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే పరిచయం. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంది జాన్వీ కపూర్ 2018 లో రిలీజ్ అయిన ధడక్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత గోస్ట్ స్టోరీస్, బాడ్ లక్ జెర్రీ, మిల్లీ వంటి సినిమాలు చేసింది. అయితే ఈ సినిమాలేవి కూడా సరైన గుర్తింపును జాన్వికి తీసుకురాలేదు. ఈ రోజుల్లో సినిమాలు ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా కూడా చాలామంది ఫ్యాన్స్ క్రియేట్ అవుతూ ఉంటారు అలా జాహ్నవి కూడా క్రియేట్ అయ్యారని చెప్పొచ్చు.

తెలుగులో ఎంట్రీ

ఇకపోతే జాన్వి కపూర్ తెలుగులో ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అంటూ చాలామంది ఎదురు చూశారు. అయితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమాలో హీరోయిన్ కనిపించనుంది జాన్వి. ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో కూడా జాన్వి మాట్లాడుతూ తెలుగులో ఏ స్టార్ తో పనిచేయాలి అనుకుంటున్నారు అని అడిగినప్పుడు. ఎన్టీఆర్ తో పని చేయాలనుకుంటున్నాను అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. మొత్తానికి దేవర సినిమాతో జాన్వీ కల నిజమవుతుంది. ఈ సినిమా హిట్ అయితే జాన్వి కి వరుస అవకాశాలు వస్తాయి.

Janhvi Kapoor

- Advertisement -

రామ్ చరణ్ సరసన

ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ సరసన ఈ సినిమాలో జాన్వి కపూర్ కనిపించింది. ఇకపోతే రీసెంట్ గా “మిస్ అండ్ మిస్టర్ మాహి” సినిమా చేసింది జాహ్నవి. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

సినిమా పైన ట్రోల్స్

అయితే జాన్వి నటించిన మిస్ అండ్ మిస్టర్ మాహి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా గురించి చాలామంది ట్రోల్స్ అనేది చేయడం మొదలుపెట్టారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి ఈ సినిమా గురించి ఒక డాక్టర్ చేసిన కామెంట్స్ తనను చాలా బాధపెట్టింది అంటూ చెప్పుకొచ్చింది. క్రికెట్ కాన్సెప్ట్ సినిమాకి జాహ్నవి వరస్ట్ క్యాండిడేట్ అంటూ అతను ట్రోల్ చేశారు దానికి జాన్వి చాలా బాధపడింది. జాన్వి ఈ సినిమా కోసం చాలా కష్టపడి క్రికెట్ నేర్చుకుంది. ఎన్నోసార్లు దెబ్బలు కూడా తగిలించుకుంది. ఇకపోతే థియేటర్లో మిస్ అయిన వాళ్లందరికీ ఇప్పుడు ఈ సినిమాను నెట్ ఫిక్స్ లో చూసే అవకాశం దక్కింది. నేటి నుంచి ఈ సినిమాకి స్ట్రీమింగ్ కి వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు