Kaduva : ఓటీటీలోకి కడువా

ఓటీటీలో వచ్చే మలయాళ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమార‌న్ ఓటీటీల వల్లే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుకుమారన్ నటించిన జన గణ మన సినిమా ఇటీవల ఓటీటీలోకి వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులకు అయితే, ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో మలయాళం సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, పృథ్విరాజ్ సుకుమార‌న్ తాజాగా కడువా అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. కడువా సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల ప్రేక్షకుల ముందుకు థియేటర్స్ లో ఈ నెల 7న వచ్చింది. పృథ్విరాజ్ సుకుమార‌న్ కు జోడీగా సంయుక్త మీనన్ నటించింది. విడుదలైన మూడు వారాల తర్వాత కడువా సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో పృథ్విరాజ్ సుకుమార‌న్ కడువా రానుంది. వచ్చే నెల 4 నుండి కడువా స్ట్రీమింగ్ కానుంది. పృథ్విరాజ్ సుకుమార‌న్ కు తెలుగులో ఫాలోయింగ్ ఉంది. కానీ, మరీ థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసేంత లేదు. దీంతో కడువా సినిమా తెలుగులో పెద్దగా రాణించలేదు. కానీ, ఇప్పుడు ఓటీటీలో వస్తే, తెలుగు ప్రేక్షకులు చూడటం ఖాయం. మంచి విజయం సాధించడం కూడా ఖాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు