Keechurallu OTT: మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Keechurallu OTT: ఈమధ్య కాలంలో చాలా మంది సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలను చూడాలని తెగ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ కూడా ఇలాంటి జోనర్ లోని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. థియేటర్లలో ఎవరైతే మిస్ అవుతారో అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఓటీటీలోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోని మలయాళం సినిమాలకు ఇప్పుడు ఓటీటీలలో మంచి ఆదరణ లభిస్తోంది.. అందుకే ఆయా భాషలకు తగ్గట్టుగా డబ్బింగ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు మేకర్స్ .. మలయాళం లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది.. అది కూడా తెలుగు వర్షన్ తో రానుంది అని తెలిసి ప్రేక్షకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్ల తర్వాత తెలుగు ఓటీటీ లోకి..

Keechurallu OTT: Another Suspense Thriller Movie.. Ready for Streaming..!
Keechurallu OTT: Another Suspense Thriller Movie.. Ready for Streaming..!

రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కేరళ బ్యూటీ రజిషా విజయన్ ప్రధాన పాత్రలో ఈమె నటించిన మలయాళం చిత్రం కీడం.. రాహుల్ రిజీ నాయర్ దర్శకత్వం వహించిన ఈ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.. ఇక దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగులో రిలీజ్ కానుంది.. ఇక్కడ కీచురాళ్ళు పేరుతో తెలుగు వెర్షన్ ను రెడీ చేశారు . అయితే థియేటర్లలో కాకుండా ఇక్కడ నేరుగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు..

ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ వేదికగా గురువారం మే 30 అనగా ఈరోజు నుంచే ఈ థ్రిల్లర్ మూవీ అందుబాటులోకి రానుంది..ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈ సినిమాను ఓటీటీ లో చూడవచ్చు.. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది.. అంతేకాదు కీచురాళ్ళు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కోసం ఎదురుచూసే ఆడియన్స్ కి ఇది మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని స్పష్టం చేసింది ఈటీవీ..

- Advertisement -

కీచురాళ్ళు సినిమా కథ..

కీచురాళ్ళు సినిమాలో రజిషా విజయన్ తో పాటు విజయబాబు శ్రీనివాసన్ కీలకపాత్రలు పోషించారు.. ఈ సినిమా కథ ఏమిటంటే.. రాధిక బాలన్ ( రజిషా విజయన్) ఒక సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా సైబర్ క్రైమ్ కి సంబంధించిన కేసులన్నింటిని ఆమె పరిష్కరిస్తూ పోలీసులకు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది.. అయితే అనుకోకుండా రాధికనే సైబర్ క్రైమ్ బాధితురాలుగా మారిపోతుంది.. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు.. మరి తన సమస్యను తానే ఎలా పరిష్కరించుకుంది? అనేది సినిమా కథ.. ఆధ్యంతం థ్రిల్ కి గురి చేస్తూ ప్రేక్షకులను సస్పెన్స్ లో పడేస్తుంది ఈ సినిమా.. మొత్తానికైతే ఇందులో రజిషా విజయన్ తన అద్భుతమైన నటనతో మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకుంది. సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంటుంది. మొత్తానికి అయితే 2022లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు వర్షన్ లో ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు