Raayan.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజాగా నటించిన చిత్రం రాయన్. ఆయన సినీ కెరియర్ లో 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఇందులో కీలకపాత్ర పోషించగా , ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్ , అపర్ణ బాలమురళి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇందులో కాళిదాసు, జయరాం, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు కూడా నటించడం జరిగింది.సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఇది. భారీ అంచనాల మధ్య జూలై 26వ తేదీన థియేటర్లలో విడుదలైన సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. కోలీవుడ్ లోనే ఏకంగా ఈ సినిమాకి రూ.100 కోట్లకు పైగా వసూలు రావడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పవచ్చు. తెలుగు నాట కూడా సుమారుగా 550 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా భారీగానే కలెక్షన్స్ వసూలు చేసింది.
ఆగస్టు 23 నుండి ఓటీటీ లో స్ట్రీమింగ్ కానున్న రాయన్..
ఇదిలా ఉండగా ఇప్పటికీ చాలాచోట్ల ఈ సినిమా థియేటర్లలో ఆడుతూ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది ఇకపోతే ఈ సినిమాను థియేటర్లకు వెళ్ళలేని వారు ఓటీటీ లలో సినిమా చూడాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు అందులో భాగంగానే అలాంటి వారిని కూడా అలరించడానికి ఓటిటి ప్లాట్ఫామ్ ఫిక్స్ అవ్వడమే కాదు ఎప్పటినుంచి ప్రసారం కానుంది అనే విషయాలు కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక ఆగస్టు 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనం రాయన్ సినిమాను చూడవచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్..
అంతేకాదు తెలుగు, తమిళ్, కన్నడ,మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రానుంది అని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ వీడియో షేర్ చేసింది . అలాగే రాయన్ సినిమాకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేసింది అమెజాన్. ఇకపోతే ఈ సినిమాలో ధనుష్ చెల్లెలిగా దుర్గా పాత్రలో దుషారా విజయన్ చాలా అద్భుతంగా నటించిందని చెప్పవచ్చు. ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకి ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేశారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతోందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూడని వారు ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి చక్కగా ఈ సినిమాని చూడవచ్చని చెప్పవచ్చు.
ధనుష్ కెరియర్..
ఇక ధనుష్ విషయానికి వస్తె, ప్రస్తుతం పలు చిత్రాలలో హీరోగా నటిస్తూ భారీ ఇమేజ్ సొంతం చేసుకున్న ధనుష్ తన చిత్రానికి తానే హీరోగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు అన్నాచెల్లెళ్ల సెంటిమెంటుతో ఈ సినిమాని తెరకెక్కించారు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Raayan has a PURPOSE to fulfill and JUSTICE to seek ⚖️🔥#RaayanOnPrime, Aug 23@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan pic.twitter.com/1I3mqFw0GR
— prime video IN (@PrimeVideoIN) August 16, 2024