Web Series: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇదే..!

Web series: ఈమధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్లలో కంటే ఓటీటీ లలోనే సినిమాలు చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. వివిధ జానర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తున్నాయి.. ముఖ్యంగా హార్రర్, సస్పెన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు ఎన్నో ప్రేక్షకులను విపరీతంగా కట్టిపడేస్తున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో చాలా మంది సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ స్టోరీలను ఎక్కువగా వీక్షించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ ఆద్యంతం ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది.

సస్పెన్స్ థ్రిల్లర్గా క్యాండీ వెబ్ సిరీస్..

Web Series: Suspense crime thriller.. This is a must watch web series..!
Web Series: Suspense crime thriller.. This is a must watch web series..!

అదే క్యాండీ.. ఈ వెబ్ సిరీస్ గురించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు అంతకుమించి సస్పెన్స్ థ్రిల్లర్ కు గురిచేస్తుంది. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎవరికైనా సరే మైండ్ స్పిన్ అవ్వాల్సిందే.. హంతకుడు ఎవరన్నది.. చివరి వరకు కూడా ఎంత టాలెంట్ ఉన్నా సరే కనిపెట్టలేరు.. అంతటి గొప్ప సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ వచ్చేసింది. క్యాండీ వెబ్ సిరీస్ లో రోనిత్ రాయ్, రిచా చద్ధా, మను రిషి చద్దా, గోపాల్ దత్, నకుల్ రోషన్ సహదేవ్ వంటి భారీ తారాగణం పవర్ఫుల్ క్యారెక్టర్ లు ఈ వెబ్ సిరీస్ లో పోషించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత ఫ్లాష్ బ్యాక్ కథ ఉంటుంది. అదే ఈ సిరీస్ లో చెప్పడం జరిగింది.. అయితే అసలు కథ వేరే..

క్యాండీ కథ..

క్యాండీ..ఈ కథ ఉత్తరాఖండ్లోని కల్పిత పట్టణం.. రుద్రకుండ్ లో జరుగుతుంది.. మొదట్లో స్కూల్ స్టూడెంట్ మెహుల్ హత్యతో ఈ కథ మొదలవడం చూపించారు.. అతడి మృత దేహం ఒక చెట్టుకు వేలాడుతూ కనిపిస్తుంది అయితే ఈ వార్త విన్న తర్వాత నగర ప్రజలు అతడిని అడవిలో నివసించే మసాన్ చంపాడని ఆరోపిస్తారు.. మసాన్ ఎవరంటే రుద్రకుండ్ అడవుల్లో ఒక క్రూరుడు నివసిస్తూ ఉంటాడు.. అతడు రాత్రి చీకట్లో ప్రజలను వేటాడి కనికరం లేకుండా చంపేస్తాడని.. అక్కడి ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు.. అయితే ఈ మసాన్ మానవుడా లేక దెయ్యమా లేదా మరేదైనా శక్తి అనేది తెలియదు. అయితే ఈ వెబ్ సిరీస్ లో చాలాసార్లు మసాన్ ను చూపించేటప్పుడు ఎర్రటి కళ్ళు… పదునైన కొమ్ములు కలిగిన వ్యక్తిలా చూపించడం జరిగింది. మరోవైపు స్కూల్లో చాలామంది అమ్మాయిలపైన అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.. అయితే ఈ రహస్యాన్ని అందరూ దాచిపెడతారు.. ఇదొక్కటే కాదు రుద్రకుండ్ లో కేడీ పేరుతో డ్రగ్స్ విక్రయిస్తూ ఉంటారు.. ఇప్పుడు అక్కడి ప్రసిద్ధి పాఠశాలలకు కూడా ఇది చేరుకుంటుంది .. ఈ పనిలో కొంతమంది పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొంటారు. అధ్యంతం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా సాగే ఈ వెబ్ సిరీస్ లో చివరికి ఉపాధ్యాయుడు జయంత్ , డిఎస్పీ రత్న కలిసి చాలామంది వ్యక్తుల మరణాల మిస్టరీని ఛేదిస్తారు… చివరి వరకు కూడా చాలా సస్పెన్స్ తో హంతకుడు ఎవరో చివరి వరకు చెప్పకుండా దాచేసి మంచి థ్రిల్ కి గురి చేశారు.. 10 కి 8 ఐఎండిబి రేటింగ్ ను కూడా సొంతం చేసుకుంది ..ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో అందుబాటులో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు