Bigg Boss Season7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ప్రేమ జంటలు- స్క్రీన్ స్పెస్ కావాలనే కోసం ఓవర్ యాక్షన్

Bigg Boss Season7

ప్రతి బిగ్ బాస్ సీజన్ లో తప్పకుండ ఉండే ప్రేమ జంటలు లేటెస్ట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా దర్శనమిచ్చాయి. సీజన్ కొక జంట పాపులర్ అయ్యి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగా..ఈసారి సీజన్ సెవెన్ లో ఏకంగా రెండు ప్రేమ జంటలు రెడీ అయ్యాయి.

మొదటి ప్రేమ జంట విషయానికొస్తే రతిక, పల్లవి ప్రశాంత్. ఈ జంట బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మొదటి రోజే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ కు హీరో నవీన్ పొలిశెట్టి లేడీ లక్కు బాండ్స్ తీసుకొచ్చి కంటిస్టెంట్స్ ఇచ్చి, అబ్బాయ్ లను హౌస్ లో ఉన్న అమ్మాయిలకు కట్టమని చెప్పగా.. పల్లవి ప్రశాంత్ సిగ్గుపడుతూ వెళ్లి హీరోయిన్ రతికకు కట్టాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ బిల్డ్ అయింది.

ఇక ఆ తరువాత నామినేషన్ డే రోజు కూడా ఈ ఇద్దరు క్లోజ్ గా ఉండటంతో హౌస్ లో అందరి దృష్టిలో ఈ ఇద్దరు ప్రేమ పక్షుల లిస్ట్ లో పడిపోయారు. కాగా నిన్న ఎపిసోడ్ లో కూడా రతిక పల్లవి ప్రశాంత్ కావాలని కొన్ని ప్రేమకు సంబందించిన ప్రశ్నలు అడిగి, ఇండైరెక్ట్ గా తనతో లవ్ ట్రాక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పల్లవి ప్రశాంత్ కూడా ఏమి మామూలోడు కాదు రతిక విషయంలో ప్రశాంత్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కానీ ఈ ఇద్దరి జంట మాత్రం కావాలనే హౌస్ లో ఎక్కువ రోజులు ఉండటానికి ప్రేమ పేరుతో ఓవరాక్షన్ చేస్తున్నారని అనుకుంటున్నారు.

- Advertisement -

ఇక రెండవ జంట విషయానికొస్తే గౌతమ్ కృష్ణ మరియు లాయర్ శోభా.. నిజానికి ఇది బిగ్ బాస్ ముడివేసిన జంట అని చెప్పవచ్చు.. ఈ ఇద్దరు కూడా షో మొదలైన రోజు నుంచి మంచి ఫ్రెండ్స్ గానే ఉంటున్నారు. అలాగే అప్పుడప్పుడు కాస్త కెమెరాలకు కనబడాలని ఓవరాక్షన్ కూడా చేస్తున్నారు. నిన్న ఎపిసోడ్ లో నైతే గౌతమ్ కృష్ణ కావాలని శోభా దగ్గరకు వెళ్లి ఆమె చెవిలో ఎదో చెప్పాడు. దానికి శోభా కూడా నవ్వింది. దీనిబట్టి చూస్తే ఈ జంట కూడా హౌస్ లో ప్రేమికులుగా నటించడానికి చూస్తుందనిపిస్తోంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు