Bigboss Season7: ఫస్ట్ టైం సుబ్బు ఏడ్చేసింది?

Bigboss Season7:

బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 7 మొదలైన రోజు నుండి బిగ్ బాస్ లవర్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా రాత్రి తొమ్మిదింటినుండి పదకొండు అయ్యే వరకు స్టార్ మా పెట్టుకుని అలాగే చూస్తుండిపోతున్నారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈ సీజన్ ఉండడంతో బిగ్ బాస్ 7 పై ఇంట్రెస్ట్ మరింత పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో లో ఏ సీజన్లో అయినా ఒకరు ఏడవడం కామన్. కొందరు సందర్భానుసారం కన్నీళ్లు పెట్టుకున్నా, మరికొందరు అదే పనిగా ఏడుస్తూ ఉంటారు.

ఈ సీజన్లో అలా ఎక్కువసార్లు చేసింది పల్లవి ప్రశాంత్. తనే గాక, దామిని, శోభా శెట్టి, యావర్ కూడా కొన్ని సార్లు ఏడ్చారు. అయితే ఇప్పటివరకు ఈ సీజన్లో డీసెంట్ ప్లేయర్ గా ఉన్న శుభ శ్రీ కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. నిజానికి శుభ శ్రీ ఈ సీజన్లో బెస్ట్ ప్లేయర్ అని కొందరి నెటిజన్ల అభిప్రాయం. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి, ఎవరితోనూ పెద్దగా గొడవలు పడకుండా, వాగ్వాదాలు పెట్టుకోకుండా, షోలో ఆడుతూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ వచ్చింది.

పైగా కొన్నిసార్లు రతిక, ప్రశాంత్ ల మధ్య గొడవలు ఆపేందుకు తాను చేసిన ప్రయత్నంతో అందరి మనసులు గెల్చుకుంది. అలాంటిది ఎప్పుడు లేనిది అమర్ దీప్ నామినేషన్ వల్ల ఫస్ట్ టైం ఏడ్చేసింది. ఈ నామినేషన్లో ప్రాపర్ రీసన్ లేకుండా నామినేట్ ఎలా చేస్తారు అంటూ, వెక్కి వెక్కి ఏడ్చేసింది. అటు అమర్ దీప్ కూడా శుభ శ్రీ అన్నదానికి బాగానే హర్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే నాలుగో వారం ఎలిమినేషన్ చాలా కష్టంగా ఉంటుందని తెలుస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు