Gangs Of Godavari : బూతు డైలాగులున్న విశ్వక్ సేన్ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఏమొచ్చిందో తెలుసా!

Gangs Of Godavari : టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో కేజ్రీ అంచనాలున్న సినిమా “గ్యాంగ్స్ అఫ్ గోదావరి”. టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా పై ముందునుండి మంచి అంచనాలు నెలకొని ఉండగా, రిలీజ్ అయిన టీజర్, గాని ట్రైలర్ గాని అంచనాలని రెట్టింపు చేసాయి. ఇంతకు ముందు గామి సినిమాలో నటించిన విశ్వక్ సేన్ ఆ సినిమా విజయం తో జోష్ మీదున్నాడు. ఇక ఇప్పుడు గ్యాంగ్స్ అఫ్ గోదావరితో ప్రేక్షకులను మరోసారి పలకరించబోతున్నాడు. అయితే నిజానికి ఈ సినిమా మార్చ్ లో రిలీజ్ కావాల్సి ఉండగా, షూటింగ్ డిలే వల్ల ఆలస్యమవగా, మే 17న రిలీజ్ అవుతుందని మళ్ళీ చెప్పగా , ఐపీఎల్ ఎఫెక్ట్, సమ్మర్ ఎండల వల్ల మళ్ళీ వాయిదా పడి ఫైనల్ గా మే 31 న రిలీజ్ కాబోతుంది. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాబోయే గ్రామీణ యాక్షన్ డ్రామా. ఇందులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా షెట్టి మరియు అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటివరకు రిలీజైన ప్రచార చిత్రాలతో సినిమా పై మంచి అంచనాలను సొంతం చేసుకుంది. ఫైనల్ గా ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.

Gangs Of Godavari Movie Received U/A Censor Certificate

సెన్సార్ సర్టిఫికెట్ దక్కించుకున్న గోదావరి…

విశ్వక్ సేన్ వరుస విజయాల తర్వాత నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, ఒక రా అండ్ రస్టిక్ సినిమాగా నిలుస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇక గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs Of Godavari) చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇక సెన్సార్ బోర్డు వారు చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ను అందించారు. అయితే ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ రావడం పట్ల కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దానికి సవాలక్షా కారణాలున్నా, మెయిన్ గా ఒక రీసన్ ని ఎత్తి చూపుతున్నారు నెటిజన్లు.

- Advertisement -

బూతు డైలాగులున్న సినిమాకి యూ/ఏ..

అయితే గ్యాంగ్స్ ఆప్ గోదావరి (Gangs Of Godavari) సినిమా ట్రైలర్ లో పలు బూతు డైలాగులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అంతే కాదు సినిమాలో కూడా పలు బూతు డైలాగులు ఉన్నాయని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ అన్నాడు. పైగా సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు అభ్యంత కరంగా ఉంటాయని టాక్ నడుస్తుంది. అలాంటప్పుడు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ వస్తుందని అనుకుంటారు అందరు. కానీ ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా థియేటర్లలో ఈ సినిమా ఏ మేరకు పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, గోపరాజు రమణ, అయేషా ఖాన్, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై నిర్మించడం జరిగింది. మరి ఈ చిత్రం ఫైనల్ గా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే మే 31 వరకు ఆగాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు