NBK 50 Years Celebrations : గెస్టుల లిస్ట్ పెద్దదే… ఎవరెవరు అటెండ్ కాబోతున్నారంటే?

NBK 50 Years Celebrations : తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్‌లో బాలకృష్ణను ఘనంగా సన్మానించనున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య కోసం గ్రాండ్ గా నిర్వహించబోతున్న ఈ వేడుకకు గెస్ట్ లుగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు అనే విషయంపై చర్చ నడుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గెస్టుల లిస్ట్ పెద్దదే. మరి తెలుగు సినిమా ఇండస్ట్రి నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వేడుకకు హాజరు కాబోతున్న అతిథుల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం పదండి.

సినీ, రాజకీయ గెస్టుల లిస్ట్

స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR) తనయుడిగా సినీ ఇండస్ట్రిలోకి అడుగు పెట్టిన బాలయ్య అతి కొద్దీ కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో 1974లో రిలీజైన తాతమ్మ కల (Tatamma kala) అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తెలుగు తెరకు నందమూరి బాలయ్య పరిచయమయ్యారు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా హీరోగా ఎన్నో సినిమాలలో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. గత కొన్నేళ్ళ నుంచి టాలీవుడ్ బడా హీరోగా కొనసాగుతున్న ఆయన నేటికీ యంగ్ హీరోలతో పోటి పడుతూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే నేటితో ఆయన సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సెప్టెంబర్ 1 న సినీ పరిశ్రమ ఘనంగా ఆయన గోల్డెన్ జూబ్లీ వేడుకను నిర్వహించాలని సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే సెప్టెంబర్ 1న సాయంత్రం పలువురు సినీ పెద్దలు, రాజకీయ నాయకుల సమక్షంలో బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ వేడుక గ్రాండ్ గా జరగనుంది.

Balakrishna : బాలయ్య 50 వసంతాల స్వర్ణోత్సవ సంబరాలు.. అటు అభిమానులు.. ఇటు సినీ పరిశ్రమ.. | Nandamuri balakrishna completing 50 years of acting career in tollywood fans and film industry celebrating ...

- Advertisement -

అయితే ఈ వేడుకకు హాజరు కాబోతున్న స్టార్స్ లిస్ట్ భారీగానే ఉంది. సుమ యాంకర్ గా వ్యవహరిస్తుండగా, టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి సీనియర్ హీరోలతో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, గోపీచంద్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు కూడా ఈవెంట్ కు అతిథులుగా హాజరు కాబోతున్నారని సమాచారం. వీరితో పాటు ఇంకా చాలామంది సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. అంటే టాలీవుడ్ స్టార్ హీరోలందరిని ఒకే ఫ్రేమ్ లో చూసే అద్భుతమైన అవకాశం సినీ ప్రియులకు రాబోతోందన్న మాట. ఇక వీరితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు ఇప్పటికే ఆహ్వానం అందగా, ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఈవెంట్ కు హాజరు కానున్నారు.

కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ ?

అయితే చాలాకాలం నుంచి బాలయ్య, చిరు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ఈవెంట్ కు చిరు కూడా హాజరు కావడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కు ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తున్నారు మూవీ లవర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు