Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల ( Niharika Konidela ) గురించి ఎంత చెప్పినా తక్కువే.. కేరీర్ మొదట్లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాలు ఆమెకు హీరోయిన్ గా సక్సెస్ టాక్ ను ఇవ్వలేక పోయాయి. కానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు నిర్మాతగా మారి కొత్త సినిమాలను నిర్మిస్తు బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె బ్యానర్ పై వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సినిమా సక్సెస్ఫుల్ టాక్ అందుకుంది. రెండో సినిమాను కూడా ఈ అమ్మడు త్వరలోనే అనౌన్స్ చెయ్యనుందని టాక్. ఈ టైం నిహారిక రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి..
ఈ అమ్మడు 2020లో చైతన్య జొన్నలగడ్డను ( Chaithanya Jonnalagadda ) పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఏవో కారణాల వల్ల మూడేళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటున్న నిహారిక తన పూర్తి దృష్టిని సినిమాలపైనే పెడుతోంది. గతంలో వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఇప్పుడు ఓ సినిమాను సినిమాను నిర్మించి భారీ సక్సెస్ ను అందుకుంది. ఈ క్రమంలో ఆమె రెండో పెళ్ళికి సిద్ధమైందనే వార్త ఆసక్తికరంగా మారింది. మళ్లీ పెళ్లి ఎప్పుడనేది చెప్పలేను కానీ, తనకు సరిపోయే వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటాను అని గతంలో నిహారిక ప్రకటించింది. అప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు నిహారిక రెండో పెళ్ళికి రెడీ అయినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది..
ఈమె పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వినిపిస్తున్నప్పటి నుంచి అందరి ఫోకస్ మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharamtej ) పైనే ఉంది. గతంలో కూడా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న వార్తలు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపించాయి. కానీ అవి కేవలం రుమార్లు గానే మిగిలాయి. ఇప్పుడు మరోసారి నిహారిక పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఇక ఇప్పుడు మరోవార్త నెట్టింట వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే కుటుంబానికి చెందిన వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దల మధ్య మాటలు పూర్తయ్యాయని, ఈ ఏడాది వీరి వివాహం జరిగే అవకాశముందని వార్త వినిపిస్తోంది. కాగా నిహారిక నటిగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే నిర్మాతగానూ రాణిస్తోంది. రీసెంట్ గా ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ భారీ విజయాన్ని అందుకుంది. అలాగే ‘వాట్ ది ఫిష్’ అనే సినిమాలో నిహారిక నటిస్తుంది.