A.M.Rathnam : వీరమల్లు కోసం సీరీయస్ గా నిర్మాత.. దర్శకుడు టెక్నిషియన్స్ తో సిట్టింగ్! పవన్ కోసమే వెయిటింగ్?

A.M.Rathnam : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో “హరిహరవీరమల్లు” చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాపై దాదాపు మూడున్నరేళ్లుగా వాయిదాలు పడుతూ తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో పవన్ అభిమానులు ఈ సినిమా రాదని అనుకున్నారు. కానీ నిర్మాత ఏఎం రత్నం పట్టు బట్టి సినిమాని ఎలాగైనా ఫినిష్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. క్రిష్ నిర్మాణ బాధ్యతల నుండి తప్పుకున్నా వెంటనే దర్శకుడు తన కొడుకైన జ్యోతి కృష్ణ ని ఎంటర్ చేసాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం షూటింగ్ లకి వాయిదా ఇచ్చాడని తెలిసిందే. అయితే జూన్ 4 త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్రీ అయిపోతాడు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ల్ని పూర్తి చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాడు. ఇప్ప‌టికే ‘ఓజీ’ టీమ్ అందుకు రెడీ అవుతుంది. సెప్టెంబ‌ర్ లో రిలీజ్ తేది ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో పీకే ఈ సినిమాని ముందుగా పూర్తి చేస్తాడు. దీంతో పాటు కుదిరితే ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ షూటింగ్ కూడా చేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వీర‌మ‌ల్లు టీమ్ కూడా రెడీ అవుతుంది.

Producer AM Ratnam is in serious discussion for Harihara Veeramallu movie

వీరమల్లు కోసం సీరియస్ డిస్కషన్..

ఇక తాజాగా హరిహర వీరమల్లు సినిమా యూనిట్ స‌భ్యులు స‌మావేశ‌మైన ఓ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతోంది. అందులో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, నిర్మాత ఏ.ఎం రత్నం , దర్శకుడు జ్యోతి కృష్ణతో పాటు ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి , విఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్ శ్రీనివాస్ మోహన్‌లు ఉన్నారు. వీరంతా వీర‌మ‌ల్లు గురించే సీరియ‌స్ గా డిస్క‌స్ చేస్తున్నారు. పెండింగ్ షూటింగ్ ఎలా ప్లాన్ చేయాలి? పూర్తి చేయాల్సిన ప్ర‌ణాళిక ఏంటి? వంటి అంశాల‌పై డిస్క‌ష‌న్ సాగిన‌ట్లు తెలుస్తోంది. అలాగే త‌దుప‌రి షూట్ కి సంబంధించి లోకేష‌న్ల గురించి చ‌ర్చ జ‌రిగిన‌ట్లు వినిపిస్తుంది. షూటింగ్ పూర్త‌యిన వ‌రకూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నారు. పీరియాడిక్ చిత్రం కాబ‌ట్టి ఇలాంటి ప‌నులు డిలే అవ్వ‌డానికి అవ‌కాశం ఉంటుంది. అందుకే క్రిష్ పూర్తి చేసిన పార్ట్ వ‌ర‌కూ ఎలాంటి పెండింగ్ లేకుండా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఏడాది చివ‌ర‌క‌ల్లా సినిమా రిలీజ్ చేస్తామ‌ని ర‌త్నం (A.M.Rathnam) ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వీలైనంత వేగంగానే ఆ ప‌నులు పూర్తిచేసే అవ‌కాశం ఉంది.

- Advertisement -

పీకే కోసమే వెయిటింగ్?

అయితే షూటింగ్ కి సంబంధించిన అన్న పనులనూ తొందర్లోనే మొదలుపెట్టబోతుండగా, చిత్ర యూనిట్ అందరి కళ్ళు పవన్ కళ్యాణ్ కోసమే ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో పవన్ కళ్యాణ్ ముందుగా ఓజి సినిమాకోసం సెట్స్ కి వెళ్లినా, ఆ తర్వాత నెలనుండైనా వీరమల్లు కోసం సమయం కేటాయించేలా ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నాడు. వీలైతే పవన్ కళ్యాణ్ కి తగ్గట్టు తన నియోజకవర్గం అయిన పిఠాపురం చుట్టుపక్కల కూడా షూటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారట. దాంతో పాటు పెండింగ్ షూట్ కూడా అంతే వేగంగా పూర్తి చేయ‌నున్నారు. ఇక రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. మొద‌టి భాగం రిలీజ్ అనంత‌రం రెండ‌వ భాగంపై తుది నిర్ణయం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా మ్యూజిక్ కి సంబంధించిన పనులపై కీరవాణితో చర్చలు జరుపుతున్నారని సమాచారం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు