రామ్ గోపాల్ వర్మ.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకుంటారు వర్మ. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతుంటారు. సోషల్ మీడియాలలో ఆర్జీవీ చేసే పోస్టులు కూడా అలాగే ఉంటాయి. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం వరుసగా ప్లాప్ సినిమాలే చేస్తున్నారు. వర్మ నుంచి ఇటీవల వచ్చిన డేంజరస్, కొండ, అమ్మాయి లాంటి సినిమాలు తెలుగులో భారీగా నష్టపోయాయి.
అయితే కొన్ని రోజుల నుండి వర్మ సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు, ట్వీట్లు ఎక్కువగా రావడం లేదు. ఇది ఇలా ఉండగా, తాజాగా ఈ వివాదాస్పద దర్శకుడు చేసిన ట్వీట్ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విడుదలైన కార్తికేయ2 ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లోనూ కార్తికేయ2 మంచి విజయం సాధించి దూసుకెళ్తుంది. ఈ సినిమాపై ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు.
ఆదివారం అమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా రూ. 1.49 కోట్లు కలెక్షన్లు చేసిందని, అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్ చిత్రం రూ. 1.01 కోట్లు కలెక్షన్లు చేసిందని ఆ ట్వీట్ లో తెలిపారు. అలాగే నిఖిల్ చిత్రం కార్తికేయ2 మాత్రం రూ. 3.04 కోట్ల వసూళ్లు చేసిందని అన్నారు. ఇది లాల్ సింగ్ చడ్డా కంటే రెండు రేట్లు, రక్షా బంధన్ కంటే మూడు రెట్లు ఎక్కువ అని తన ట్వీట్ లో తెలిపారు. ఈ రెండు చిత్రాల కలెక్షన్లు కలిపి చూసుకున్నా, కార్తికేయ2కు రూ. 50 లక్షలు ఎక్కువగానే వచ్చాయని అన్నారు. ఇలాంటి ఆసాధ్యమైన ఫీట్ సాధించిన హీరో నిఖిల్ కు దర్శకుడు చందూ మొండేటికి అభినందలను తన ట్వీట్ తో తెలిపారు.
Yesterday Åamîr Khan’s LSC is 1.49, Akshay Kumar’s Raksha bhandan is 1.01 and Nikhil’s Karthikeya 2 is 3.04 which is double of LSC,triple of RB and 50 L more than LSC and RB put together.HATS off to @actor_nikhil @abhishekofficl and @chandoomondeti for this impossible feat💐💐💐
— Ram Gopal Varma (@RGVzoomin) August 21, 2022