Raj Tarun Case : టాలీవుడ్ లో రాజ్ తరుణ్, లావణ్యల కేసు రోజు రోజుకు కీలకంగా మారుతుంది.. రాజ్ తరుణ్ కేసులో పూర్తిగా ఇరుక్కున్నట్లు తెలుస్తుంది.. ఈ కేసు విచారణలో పోలీసులకు రోజుకో ట్విస్ట్ ఎదురవుతుంది.. లావణ్య తనని వాడుకొని వేరే అమ్మాయి రాగానే తనని వదిలేశాడని ఆరోపిస్తూ రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే.. లావణ్య వరుస రాజ్ తరుణ్ పై కేసులు పెడుతుంది.. ప్రస్తుతం ఈ మ్యాటర్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.. తాజాగా మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..
రాజ్ తరుణ్ పై అనేక కేసులు నమోదు అవ్వడంతో ఆయనకు పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే.. ఈ నెల 18 న రాజ్ తరుణ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు కావాల్సి ఉంది.. కానీ అతను అందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది.. నేను విచారణకు హాజరు కానని చెప్పినట్లు టాక్.. రాజ్ తరుణ్ అలా అనడానికి కారణం కూడా లేకపోలేదు.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదల అవుతున్నాయి.. వాటికి ప్రమోషన్స్ కూడా చెయ్యలేని పరిస్థితుల్లో ఉన్నాడు..
అయితే విచారణకు రమ్మన్న తేదీలో సినిమాకు సంబందించిన ఈవెంట్ ఉండటంతో డుమ్మా కొట్టనున్నాడని సమాచారం.. పోలీసులు పంపిన నోటీసులను లెక్క చెయ్యకపోతే కేసులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. అటు లావణ్య కేసు పై ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు కూడా నిలబడినట్లు తెలుస్తుంది.. రాజ్ తరుణ్ తో పాటుగా మాల్వి మల్హోత్రా కూడా హాజరు కానున్నట్లు సమాచారం.. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో పోలీసులు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. అంటే ఇక కేసులు కూడా అతనికి అనుకూలంగా లేకపోవడంతో ఇక అరెస్ట్ తప్పదు అని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే రేపటివరకు వెయిట్ చెయ్యాల్సిందే..