Anasuya : జబర్దస్త్ కు అసలేమైంది..?

జబర్దస్త్, బుల్లితెరపై విజయవంతంగా నడుస్తున్న కామెడీ షో. జబర్దస్త్ నుండి కెరీర్ ప్రారంభించిన చాలామంది కమెడియన్లు సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. మొదట, వారానికి ఒక్క ఎపిసోడ్ గా వచ్చిన “జబర్దస్త్” కు ప్రేక్షకుల ఆధారణ పెరగడంతో “ఎక్స్ట్రా జబర్దస్త్” అనే పేరుతో మరో షో మొదలుపెట్టారు. ఈ షో కూడా సూపర్ సక్సస్ అయింది.

“జబర్దస్త్” లో హైపర్ ఆది, “ఎక్స్ట్రా జబర్దస్త్” లో సుడిగాలి సుధీర్ కి ఎంతో పేరు వచ్చింది. కానీ గత కొద్ది రోజుల నుండి ఒక న్యూస్ చక్కెర్లు కొడుతుంది. మల్లెమాలకు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పి, జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నారని ఈ వార్తల సారాంశం. దీనిని నిజం చేస్తూ ఇటీవల ఓ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ అయింది. అలానే యాంకర్ అనసూయ కూడా “జబర్దస్త్” కి గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ గా వస్తున్న ఈ షోను ఇప్పుడ ఒకే షోగా తీసుకురావాలని మల్లెమాల ప్లాన్ చేస్తుందట. దీనిలో రష్మి గౌతమ్ నే యాంకర్ గా పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీంతో అనసూయ మల్లెమాల ఎంటర్టైన్ మెంట్స్ కి దూరంగా ఉంటుందట. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఎపిసోడ్స్ ను టెలికాస్ట్ చేసిన తర్వాత, అనసూయ జబర్దస్త్ లో కనిపించడం కష్టమేనని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు