Bigg Boss 8: ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మేకర్స్ లో టెన్షన్ మొదలు..!

Bigg Boss 8: 2017లో ప్రయోగాత్మకంగా బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హోస్టుగా దీనికి వ్యవహరించారు. ఫస్ట్ సీజన్ లో టాప్ సెలబ్రిటీ లందరూ పాల్గొన్నారు. అంతేకాదు దాదాపుగా వెండితెర సెలబ్రిటీలు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. జ్యోతి, నవదీప్, శివబాలాజీ, అర్చన ,సంపూర్ణేష్ బాబు, సింగర్స్ కల్పన, మధుప్రియ, ధనరాజ్, సమీర్ , ముమైత్ ఖాన్ ఇలా చాలామంది వెండితెర సెలబ్రిటీలే కావడం తో ఈ షో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక రెండవ సీజన్లో కూడా దాదాపు సెలబ్రిటీలను తీసుకువచ్చారు. సీజన్ 3కి కూడా టాప్ సెలబ్రిటీలను తీసుకొచ్చారు.

Bigg Boss 8: Bad news for lovers.. Tension starts in the makers..!
Bigg Boss 8: Bad news for lovers.. Tension starts in the makers..!

4వ సీజన్ నుండే కథ మొదలు..

కానీ 4వ సీజన్ నుండి సీన్ మారిపోయింది.దీనికి కారణం కరోనా.. కరోనా విజృంభించడంతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. అప్పటికి కూడా బిగ్ బాస్ షో ఆగలేదు.. కఠిన నిబంధనలు పెట్టి కొన్ని వారాలు క్వారంటైన్ చేసి పరీక్షలు జరిపి, ఆ తర్వాత హౌస్ లోకి పంపించారు. ఇంతటి కఠిన నిబంధనలు పెట్టేసరికి ఎవరూ కూడా ఆసక్తి చూపించలేదు. అందుకే బిగ్ బాస్ సీజన్ 4 లో అందరూ పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్స్ కావడం గమనార్హం.

అత్యంత నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తోంది.

ఐదవ సీజన్ నుంచి బుల్లితెర , సోషల్ మీడియా స్టార్స్ తో బిగ్ బాస్ షో ని నడిపిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న రచ్చ చూస్తూ ఉంటే , ఈ షో కి రావాలని ఆసక్తి చూపే సెలబ్రిటీలు కూడా తగ్గిపోతున్నారని చెప్పవచ్చు. అంతేకాదు ఈ షో వల్ల కలిగే ప్రయోజనాల కంటే జరిగే కీడే ఎక్కువనే సందేశం పరిశ్రమ లోకి బాగా వెళ్లింది. ప్రాక్టికల్ గా చూసినా కూడా అది నిజమే అనిపిస్తుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ లో పనిచేసిన చాలామందికి కెరియర్ అద్వానంగా మారిందని చెప్పాలి. అందుకే చాలామంది ఇప్పుడు హౌస్ లోకి రావడానికి ఒప్పుకోవడం లేదు. అంతేకాదు పాజిటివ్ కంటే కూడా నెగిటివ్గా సెలబ్రిటీలను ప్రొజెక్టు చేస్తోందనే వాదన కూడా ఉంది. ఫలితంగా వారికి అభిమానులలో వ్యతిరేకత ఏర్పడడంతో అవకాశాలు కూడా రాకుండా పోతున్నాయి.

- Advertisement -

అందుకే మేకర్స్ లో కొత్త టెన్షన్..

ఉదాహరణకు బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ద్వారా శోభా శెట్టి భారీ పాపులారిటీ దక్కించుకుంది. కానీ సీజన్ 7 లో అడుగుపెట్టిన తర్వాత ఈమె అత్యంత నెగెటివిటీ మూటగట్టుకున్న సెలబ్రిటీగా మిగిలిపోయింది. అంతేకాదు కార్తీకదీపం 2 సీరియల్ లో అవకాశం రాలేదు. అలాగే మిగతా సీరియల్స్ లో కూడా అవకాశాలు రాకపోయేసరికి ప్రస్తుతం చీరల బిజినెస్ చేసుకుంటూ కెరియర్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి హౌస్ లోకి వెళ్తే అసలుకే మోసం వస్తుంది. లాంగ్ టైం కెరియర్ మీద దెబ్బ పడే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు త్వరలో సీజన్ 8 ప్రారంభం కానున్న నేపథ్యంలో హౌస్ లోకి రావడానికి సెలబ్రిటీలు ఆసక్తి చూపించడం లేదనే వార్త వినిపిస్తోంది. సెప్టెంబర్ మొదటివారంలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఇప్పటివరకు కంటెస్టెంట్లకు సంబంధించిన జాబితా తయారు కాలేదు. పైగా ఈ షో కి రావడానికి ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదట. పైగా ఎక్కువ పారితోషికం ఇస్తామని చెప్పినా కూడా ఓకే చెప్పట్లేదని సమాచారం. మొత్తానికి అయితే సెలబ్రిటీలు ఈ షో కి రావడానికి భయపడుతున్నారని అందుకే మేకర్స్ లో కొత్త టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు