Murthy : ఇక‌ లేరు

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ఎప్పుడు ఎవ‌రో ఒక‌రు మ‌ర‌ణిస్తూనే ఉన్నారు. ప్ర‌ధానంగా అంతులేని క‌ష్టాలు, బాధలు, వ్యాధుల మ‌ధ్య జీవిత‌మే క‌ష్టం అయిపోయింది. ప్ర‌ధానంగా సినీ ఇండ‌స్ట్రీ చాలా మంది న‌టుల‌ను కోల్పోయింది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా టెలివిజ‌న్ ఇండ‌స్ట్రీలో కూడా ఇలాంటి విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

ప్ర‌ముఖ మిమిక్రీ ఆర్టిస్టు, జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడీయ‌న్ గా ఓ వెలుగు వెలిగిన క‌మెడియ‌న్ మూర్తి ఇవాళ క‌న్నుమూశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న సోద‌రుడు అరుణ్ మీడియాతో ధృవీక‌రించారు. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడీయ‌న్‌గా మిమిక్రీ మూర్తి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ ఒక‌టే కాదు.. ప‌లు వేదిక‌ల‌పై కూడా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గ‌త కొద్ది సంవ‌త్సరాలుగా ప్యాంక్రియాస్ క్యాన్స‌ర్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌తిరోజు తీసుకునే మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ చూపించ‌డంతో హ‌న్మ‌కొండ‌లో ఇవాళ క‌న్నూమూశారు.

క్యాన్స‌ర్ కార‌ణంగా ఆయ‌న కేవ‌లం మూడు సంవ‌త్స‌రాల కాలంలో త‌న వైద్యం కోసం రూ.16ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో మూర్తిని కాపాడ‌డానికి ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ త‌న‌వంతు స‌హాయాన్ని కూడా అందించింది. కొంత మంది దాత‌లు కూడా స‌హాయం చేశారు. ఇక ఆయ‌న‌ ప‌రిస్థితి చేయి దాటిపోవ‌డంతో తిరిగి రాని లోకాల‌కు వెళ్లారు. ఈయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసిన ప‌లువురు క‌న్నీటి ప‌ర్వంతం అవుతున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు