Guppedantha Manasu Stars: స్మాల్ స్క్రీన్ హీరోల మధ్య ఫ్యాన్ వార్.. అమ్మ,చెల్లి అంటూ..!

Guppedantha Manasu Stars.. సాధారణంగా హీరోల అభిమానుల మధ్య మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వార్ జరుగుతూ ఉంటుంది. అయితే అది ఒక్కొక్కసారి ముదిరి.. ఇంట్లో వాళ్ళను దూషించుకునే స్థాయికి దిగజారుతూ ఉంటారు.. అయితే ఇదంతా సిల్వర్ స్క్రీన్ హీరోల మధ్య జరగడం సాధారణం.. కానీ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ హీరోల అభిమానుల మధ్య కూడా వార్ ముదురుతోందనే చెప్పాలి. కొన్ని రోజులుగా గుప్పెడంత మనసు సీరియల్ హీరోల అభిమానుల మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడది తారస్థాయికి చేరుకుంది.. గుప్పెడంత మనసు సీరియల్ లో మనో పాత్ర పోషిస్తున్న డాక్టర్ కమ్ నటుడు రవిశంకర్ రాథోడ్ పై రిషి అలియాస్ ముఖేష్ గౌడ అభిమానులు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.

మను పై రిషి ఫ్యాన్స్ ఫైర్..

Guppedantha Manasu Stars: Fan war between silver screen heroes.. Mother, sister saying..!
Guppedantha Manasu Stars: Fan war between silver screen heroes.. Mother, sister saying..!

ఇక ఇలా స్మాల్ స్క్రీన్ హీరోల మధ్య వార్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. వాస్తవానికి మొదటి నుంచి మనుపై రిషి ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్లు పెడుతూ.. నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. రిషి ని తప్పించి మను ను సీరియల్ లోకి తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రిషి ఫ్యాన్స్.. మొదట్లో చిన్నగా మొదలు అయిన ఈ గొడవ ఇప్పుడు ఎక్కువగా జరుగుతోంది. సీరియల్ వరకు

 

- Advertisement -

ఉండాల్సిన గొడవ వ్యక్తిగతంగా మారినట్లు తెలుస్తోంది. మను అలియాస్ రవిశంకర్ ను అతడి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ రిషి ఫ్యాన్స్ చాలా దారుణంగా బూతులు తిడుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోతున్నారు.

ఇంట్లో ఆడవాళ్లను టార్గెట్ చేస్తున్నారు – మను

ఇక ఈ విషయాన్ని తాజాగా మను ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి పాత్రలో నటించే ముఖేష్ గౌడ కు ఆరోగ్యం బాలేదు.. ఆ కథకు ఒక హీరో అవసరం.. అందుకే ఆయనను తీసేసి నన్ను పెట్టుకున్నారు.. హీరో లేకుండా కథను చేయలేరు కదా.. నాకు ఇచ్చిన పాత్రను నేను పోషించాను అంతే.. కానీ నన్ను మాత్రం రిషి ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు.. మా అమ్మను, చెల్లిని , అక్కను అందర్నీ టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు..ముఖ్యంగా ఈ బూతులు తిట్టేవాడు బూతు పోస్టులు పెట్టే వాడి ప్రొఫైల్ చూస్తే మాత్రం 0 ఫాలోవర్స్.. జీరో పోస్టులు బయటకు వచ్చి మాట్లాడరా అంటే అలా కాదు.. ఎవడో కూడా తెలియదు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు..

రిషి ఫ్యాన్స్ పై మను ఆవేదన..

అంతేకాదు ఆగ్రహం వ్యక్తం చేస్తూ… లైవ్ లోకి వస్తా..రా మాట్లాడు.. నీ సామర్థ్యం ఏంటో తేలిపోద్ది. రా తేల్చుకుందాం.. నేను ఊరికే రాలేదు.. ఈరోజు సీరియల్స్ మానేసినా కూడా నన్ను ఇంట్లో బ్రహ్మాండంగా చూసుకుంటారు.. మా ఇంట్లో పదిమంది డాక్టర్స్ ఉన్నారు.. యాక్టింగ్ అంటే ఫ్యాషన్ నాకు.. అందుకే చేస్తున్నాను. నేను ఏం చేయను.. ఇంట్లో ఉంటాను అంటే ఏ లోటు లేకుండా చూసుకుంటారు మా నాన్న.. నామీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి.. మాకు గుడి ఉంది ..దానికి ధర్మకర్తలుగా ఉన్నాము మేము సంపాదించింది దానం చేస్తాము అడుక్కోవడం లేదు.. తిరుపతి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్ మెంబర్ నేను.. ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఆటో స్టాండ్ మా నాన్న నిర్మించారు.. అందుకే నన్ను ఆ యూనియన్ మెంబర్ చేశారు నన్ను తిడుతున్నట్లు వాళ్లకు చెబితే మీకు వాయించి పడేస్తారు.. కానీ నేను అలా చేయను… అలా చేస్తే మీకు నాకు తేడా ఏముంటుంది.. ఇలా పర్సనల్ అటాక్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మను.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు