Kalki2898AD : 1500 కోట్ల కోసం అశ్విని దత్ ఇలాంటి పని చేస్తున్నాడా?.. మరీ దారుణం భయ్యా..

Kalki2898AD : పాన్ ఇండియా హీరో ప్రభాస్ కల్కి సినిమాతో రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. అంతేకాదు 1100 కోట్ల గ్రాస్ ను అందుకుంది.. అయితే ఈ సినిమా విడుదలకు ముందు నిర్మాత అశ్వినీ దత్ 1500 కోట్లు రాబడుతుందని చెప్పారు. ఇప్పుడు అంత వసూల్ చెయ్యడం అసాధ్యం అని తెలుస్తుంది.. కలెక్షన్స్ అంత రాకపోవడంతో అశ్విని దత్ మరో విధంగా రాబట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం అదిరిపోయే ప్లాన్ వేసాడు..

Ashwini Dutt has a new plan for Kalki2898AD movie to cross 1500 crore mark

అశ్వినీ దత్ సినిమాను 1500 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకోసం బుజ్జి కార్ల అమ్మకాలను చేపట్టినట్లు తెలుస్తుంది. గతంలో ఈ విషయం పై అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ కార్లను మార్కెట్ లోకి వదిలినట్లు తెలిసిందే.. తాజాగా వైజంతి అఫిషియల్ ట్వీట్ లో కార్ల ధరల గురించి ట్వీట్ చేశాడు.. చిన్న కారు అయితే రూ.500, పెద్ద కారు ధర అయితే రూ. 1300 వరకు ఉంటుందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. సినిమా వచ్చి నెల రోజులు అయ్యాక ఇలాంటి కొత్త బిజినెస్ ప్లాన్ చెయ్యడం పై ఫ్యాన్స్ గుప్పిస్తున్నారు..

- Advertisement -

ఇప్పటివరకు సినిమాకు వచ్చిన కలెక్షన్ ను సరిపోలేదేమో ఇలాంటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడా? అంటూ డార్లింగ్ ఫ్యాన్స్, అటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చి నెల అయ్యింది. ఈ సినిమాకు ఇప్పటికి కలెక్షన్స్ తగ్గలేదు.. ఈ సినిమా సైన్స్, ఇతిహాసాలతో కూడిన సినిమా.. ప్రేక్షకులు చూస్తున్నంత సేపు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో అసలు కథను డైరెక్టర్ నాగ్ అశ్విన్ రివిల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు