టాలీవుడ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను శ్రీలంక పరిసర ప్రాంతాల్లో తెరకెక్కిస్తున్నారు. 2024 లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే సుకుమార్ ఆ తర్వాత ఏ హీరో తో సినిమా చేస్తాడన్నది చర్చనీయాంశం గా మారింది. అయితే గత కొన్ని నెలల నుండి సుకుమార్ విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటు విజయ్ కూడా తాను చేస్తున్న ఖుషి సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యలేదు. కాబట్టి వీరి కాంబినేషన్ లో సినిమా సెట్ అయిందని ఆ సినిమా ఒక మంచి లవ్ స్టోరీ గా ఉండబోతుందని వార్తలు వినిపించాయి.
అయితే ఇప్పుడు సుకుమార్ గురించి మరో వార్త వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యడానికి సుకుమార్ అంతగా ఇష్టపడట్లేదని, ఎందుకంటే తాను ఇప్పుడు మీడియం బడ్జెట్ సినిమాలు చెయ్యడానికి సిద్ధంగా లేడని, ఆ సినిమా కాన్సల్ చేసి మరో హీరో తో సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం.
సుకుమార్ పుష్ప 2 తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక మాస్ కమర్షియల్ సినిమా చెయ్యబోతున్నారని, రంగస్థలం లాగానే అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందని సమాచారం. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో రూపొందుతుందని అంటున్నారు.మరి ఈ గాసిప్స్ లో ఏది నిజమో, ఏది అబద్ధమో సుకుమార్ స్పందించి ఈ వార్తలకు తెరదించుతాడో లేదో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News