ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అందం, అభినయం కలగలిసిన నటన తో ఇండస్ట్రీ లో ఒక తరం ఏలిన సౌందర్య అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి ఎక్స్పోజింగ్ పాత్రలు లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒకానొక సమయంలో ఈ హీరోయిన్ డేట్స్ కోసం దర్శక నిర్మాతలు కూడా వెయిట్ చేసేవారు అంటే ఈమె ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సౌందర్య 31 ఏళ్లకే కన్ను మూసింది. అయితే ఈమెకు ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయట. అప్పటి లెక్క ప్రకారం దాదాపు 100 కోట్ల ఆస్తులు సౌందర్యకు ఉన్నట్లు అప్పట్లో కుటుంబ సభ్యులు చెప్పారు.
సౌందర్య చనిపోయిన కొన్ని నెలలకే కుటుంబంలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. ఆమె ఆస్తి కోసం భర్త రఘు కూడా చాలా ప్రయత్నాలు చేశాడు. సౌందర్య వీలునామా రాశారని, అందులో ఉన్నదాని ప్రకారం తమకు కూడా ఆస్తులు పంచాలని సౌందర్య సోదరుడు అమర్ నాథ్, అతని భార్య నిర్మల.. ఆమె కుమారుడు సాత్విక్ 2009లో బెంగళూరులోని మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. అసలు సౌందర్య వీలునామే రాయలేదని, నిర్మల సోదరుడు న్యాయవాది కావడంతో తప్పుడు వీలునామా సృష్టించారని, సౌందర్య తల్లి మంజుల, రఘు కోర్టుకు విన్నవించారు. అప్పటినుంచి కోర్టులో వివాదం నడుస్తూనే ఉంది.
తన అత్త మంజుల, వరుసకు సోదరుడు అయిన రఘు తనపై కక్ష సాధిస్తూ దౌర్జన్యం చేస్తున్నారని నిర్మల కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌందర్య రాసిన వీలునామా నకిలీ అనే ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ నిర్మల న్యాయవాది ధనరాజ్, సౌందర్య భర్త రఘు, ఆమె తల్లి మంజులపై పరువు నష్టం కేసు వేశారు. ఈ వివాదాలతో ఇంతకాలం వీరు కోర్టు చుట్టూ తిరిగారు. 2013 డిసెంబర్ 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులు పంచుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి సౌందర్య చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆస్తుల కోసం చాలా వరకు వివాదాలు జరిగాయి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News