Vimanam: అన్ని నీతులు చెప్పి ఇప్పుడు ఇలా చేస్తుందేంటి?

జబర్దస్త్ యాంకర్ గా తెలుగువారికి సుపరిచితమైన నటి అనసూయ. ముందు న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా పాపులర్ కాగా క్షణం సినిమాతో వెండితెరను పలకరించింది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర ద్వారా టాలీవుడ్ లో ఫేమస్ అయిన అనసూయ వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయింది. సినిమాల్లోకి వచ్చాక జబర్దస్త్ మానేసిన అనసూయ పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించింది. ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న అనసూయ గ్యాప్ లో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళింది.

అయితే వెకేషన్ లో భాగంగా ఓ బీచ్ లో సందడి చేసిన అనసూయ అక్కడ బోల్డ్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పెట్టి షేర్ చేసింది. అంతే కాదు భర్తతో కలిసి లిప్ లాక్ చేస్తూ ఫోజులిచ్చింది. ఇవి చూసిన నెటిజన్స్ అనసూయను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో అర్జున్ రెడ్డి సినిమాపై బోల్డ్ సీన్లు, లిప్ లాక్ సీన్ల విషయంలో డిబేట్ లు పెట్టి మరీ విమర్శించిన అనసూయ ఇప్పుడు తన వరకు వచ్చే సరికి అలాగే ప్రవర్తిస్తుందంటూ ట్రోల్ చేస్తున్నారు. బయటివాళ్లను అనే ముందు తాను కూడా పద్ధతిగా ఉండాలంటూ ఇలాంటి స్టిల్స్ ఇంస్టాగ్రామ్ లో పెట్టి పబ్లిక్ కి ఏం తెలియచేద్దామని అనుకుంటున్నారని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఇదిగాక అనసూయ రీసెంట్ గా నటించిన పలు చిత్రాల్లో బోల్డ్ సీన్లలోనూ నటించింది. ఏది ఏమైనా ఇప్పుడు అనసూయ పెట్టిన ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పుష్ప 2 సినిమాలో అనసూయ నటిస్తుండగా, తాను నటించిన లేటెస్ట్ సినిమా “విమానం” జూన్ 9న విడుదల అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు