మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో భోళా శంకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న రిలీజ్ సిద్దమవుతున్న ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. తమిళ్ సినిమా వేదాళం కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటిస్తుండగా తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి కీర్తి సురేష్ డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కీర్తి, తన ఇంస్టాగ్రామ్ లో డబ్బింగ్ స్టూడియోలో దర్శకుడు మెహర్ రమేష్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. మెహర్ రమేష్ ని ‘అన్న’ అంటూ సంబోధిస్తూ కీర్తి చేసిన ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
రీమేక్ కావడంతో అనౌన్స్ చేసిన నాటి నుండి ఈ సినిమాపై మెగా అభిమానుల్లో కూడా పెద్దగా ఆసక్తి నెలకొనలేదు. అయితే, ఆ మధ్య మేడే సందర్బంగా విడుదల చేసిన మెగాస్టార్ ఫోటోలు వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తుండటంతో కాస్త పాజిటివిటి వచ్చింది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించిన భోళా మేనియా సాంగ్ ఇటీవలే రిలీజ్ అయ్యి సినిమాపై ఆసక్తి పెంచుతోంది.
ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల రిజల్ట్ ప్రభావం వల్ల మెగాస్టార్ ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని, భోళాశంకర్ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు తన నెక్స్ట్ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మెగాహీరోల నుండి రీమేక్స్ ఎక్కువ వస్తున్నాయన్న అపవాదు ఉన్న తరుణంలో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News