BRO Pre Release Event: త్రివిక్రమ్ వల్లే ఆ ఇద్దరు ఈవెంట్ కి రాలేదా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan), మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ మంగళవారం గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఈవెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్ అటెండ్ అవ్వకపోవటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా, డైరెక్టర్స్ క్రిష్, హరీష్ శంకర్ కూడా అటెండ్ అవ్వకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి క్రిష్ తప్పకుండ ఈ ఈవెంట్ కి అటెండ్ అవుతాడని భావించారు ఫ్యాన్స్. ఇక ప్రతి పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కి మిస్ కాకుండా అయ్యే హరీష్ శంకర్ ఇప్పుడు పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా కమిట్ అయ్యాడు కాబట్టి తప్పకుండ వస్తాడని అనుకున్నారు.

అయితే, ఈ డైరెక్టర్స్ ఇద్దరూ అటెండ్ అవ్వకపోవటానికి స్ట్రాంగ్ రీజన్ ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదేంటంటే, క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహర వీరమల్లు, హరీష్ డైరెక్ట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు డిలే అవ్వటానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ అని, వీరిద్దరికి త్రివిక్రమ్ కి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇన్వైట్ చేసినప్పటికీ అటెండ్ అవ్వలేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో త్రివిక్రమ్ సెట్ చేసిన ప్రాజెక్ట్స్ అయిన బ్రో సినిమా ఎక్కడా డిలే అవ్వకుండా పూర్తయ్యి రిలీజ్ అవుతుండగా, లేట్ గా మొదలైన ఓజి సినిమా దాదాపు 50శాతం షూటింగ్ కంప్లీట్ అవ్వటం పట్ల హరీష్, క్రిష్ అసహనంగా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలకు అన్నీ తానై వ్యవహరిస్తున్న గురూజీ మిగతా సినిమాల విషయంలో తలనొప్పిగా మారాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2024 ఎన్నికల తర్వాత మొదలయ్యే అవకాశం ఉండగా, హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఆల్మోస్ట్ అటకెక్కినట్లే అని అంటున్నారు. మరి, పవన్ కళ్యాణ్ కెరీర్లోనే మొదటి సారి హిస్టారికల్ బ్యాక్డ్రాప్ లో నటించిన వీరమల్లు సినిమాకి మోక్షం ఎప్పుడొస్తుందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు