ఈమధ్య ఫిలిం ఇండస్ట్రీలో విడాకులు కామన్ అయిపోయాయి. ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, డేటింగ్ ఎంత కామన్ అయిపోయాయో పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం కూడా అంతే కామన్. ఎంతోమంది స్టార్స్ అలా విడిపోయారు. ముఖ్యంగా బాలీవుడ్ లో స్టార్ కపుల్స్ పై ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా విడాకుల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొనే పై కూడా ఈ మధ్య రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ జంటని అభిమానులు ప్రేమగా “డీప్ వీర్” అని పిలుచుకుంటూ ఉంటారు.
వీరిద్దరూ పెళ్లి చేసుకుని పది సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. అయితే ఇంతవరకు వారికి పిల్లలు లేరు. ఈ విషయంపై వారిద్దరూ ఏ మాత్రం మాట్లాడే వారు కాదు. అయితే తాజాగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు మరోసారి బయటకు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్ పై జరిగిన ఒక సంఘటన వల్ల వారి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నట్లు ప్రవర్తించారు. రెడ్ కార్పెట్ పై వీరిద్దరూ నడుచుకుంటూ వెళుతుండగా రణ్వీర్ దీపిక చేయి పట్టుకోవాలని చూస్తే.. ఆమె మాత్రం చెయ్యి ఇవ్వలేదు. అలా కాస్త ముందుకు వెళ్లి రన్వీర్ దీపికను చూస్తే ఆమె ఏమీ పట్టనట్టు ముందుకు వెళ్ళిపోయింది.
రణవీర్ ని దీపిక అస్సలు పట్టించుకోనట్లుగా వ్యవహరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయని మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరు ఇప్పటికే ఆస్తులన్నింటినీ ఎవరివి వారు పంచేసుకున్నారని, అంతేకాదు ఇద్దరూ వేరువేరుగానే ఉంటున్నారని.. అఫీషియల్ గా విడాకులు వచ్చేవరకు అలా కలిసి కొన్ని ఈవెంట్లలో పాల్గొంటున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో వారికే తెలియాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News