Dil Raju: మొత్తానికి నిజం ఒప్పుకున్న దిల్ రాజు..!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో  వచ్చిన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. శకుంతల, దుశ్యంతుల ప్రేమ కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది. రిలీజ్ కి ముందు గుణశేఖర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి కానీ, సినిమా విడుదలయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. శకుంతల పాత్రలో సమంత బాగానే నటించినప్పటికీ పేలవమైన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. హీరో దేవ్ మోహన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేకపోవటం కూడా ఈ సినిమా డిజాస్టర్ అవ్వటానికి కారణం అని చెప్పచ్చు.

ఇటీవల ఓ ఇంటార్వ్యులో పాల్గొన్న దిల్ రాజు శాకుంతలం రిజల్ట్ గురించి ఓపెన్ అయ్యాడు. తన 25ఏళ్ళ కెరీర్లో ఏ సినిమా ఇవ్వని ఝలక్ శాకుంతలం ఇచ్చిందని అన్నారు. గుణశేఖర్ తో కలిసి సహా నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఈ సినిమా వాళ్ళ అటు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా రెండు విధాలా నష్టపోయానని అన్నారు. దిల్ రాజుకి కథలని జడ్జ్ చేయటంలో మంచి ట్యాలెంట్ ఉందని ఇండస్ట్రీలో అందరూ అంటూ ఉంటారు. అలాంటి దిల్ రాజు శాకుంతలం విషయంలో ఎలా పొరపాటు చేసారని అందరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దిల్ రాజుకి ఆ ఆనందం మూన్నాళ్ల  ముచ్చటగా చేసింది శాకుంతలం సినిమా.

రుద్రమదేవి సినిమా సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి దిల్ రాజు శాకుంతలం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారని తెలుస్తోంది. మొత్తానికి రుద్రమదేవి సినిమా ద్వారా తన చేతులు కాల్చుకున్న గుణశేఖర్, శాకుంతలం సినిమాలో మళ్ళీ అవే తప్పులు రిపీట్ చేసి దిల్ రాజుకి నష్టం మిగిల్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అవటంతో దిల్ రాజు కాస్త డిస్టర్బ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇకనైనా దిల్ రాజు ఇలాంటి సినిమాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉంటాడేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు