మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రామ్ చరణ్… ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పానీ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఇప్పుడు తమిళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజెర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. కాగా,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు పదేళ్ల కిందట… వీరి వివాహం జరిగింది.
ఇక గత సంవత్సరం చివర్లో ఉపాసన ప్రెగ్నెన్సీ గురించి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా రివిల్ చేశారు. దీంతో అప్పటి నుంచి మెగా కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఉపాసన పండంటి బిడ్డ కు జన్మ ఇవ్వనుంది. ఈ తరుణంలో ఉపాసన కు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వల అనే ఫౌండేషన్ లో పని చేస్తున్న మహిళలు… ఓ ఉయ్యాల తీసుకువచ్చారు. దీనిని స్వయంగా ఆ మహిళలు తయారు చేసి తీసుకురావడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా మెగా కోడలు ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఉజ్వల ఫౌండేషన్ కోసం చాలా రోజుల నుంచి ఉపాసన ఫండ్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే ఆమె బిడ్డ కోసం ఉయ్యాల తీసుకువచ్చారు ఉజ్వల ఫౌండేషన్ మహిళలు. అయితే ఇదంతా పక్కకు పడితే తాజాగా ఆ ఉయ్యాల ధర గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ జరుగుతోంది. ఆ ఉయ్యాల దాదాపు 80 లక్షల వరకు ఉంటుందని ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇలాంటి ఉయ్యాలను ఎక్కువ శాతం విదేశీయులు కొనుక్కొని పోతారని.. చెబుతున్నారు.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News