Power Star: పవన్ ఫ్యాన్స్ హడావిడి ముగిసింది – మహేష్ ఫ్యాన్స్ మాత్రం లక్కీ..!

టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల పుట్టినరోజు వంటి సందర్భాన్ని పురస్కరించుకొని అప్పట్లో హిట్ అయిన సినిమాలు రీ రిలీజ్ చేసి సందడి చేస్తున్నారు అభిమానులు. ఇటీవల ఒక్కడు, జల్సా, వంటి సూపర్ హిట్ సినిమాలు రీరిలీజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి. అప్పట్లో డిజాస్టర్ అయిన ఆరెంజ్ సినిమా రీరిలీజ్ చేస్తే 3కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ కెరీర్ తొలినాళ్లలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమా కూడా మే 20న రీరిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. రీరిలీజ్ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాకు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రీరిలీజ్ చేశారు.

పోకిరి సినిమా రీరిలీజ్ తో మొదలైన ఈ ట్రెండ్ తరచూ ఎదో ఒక రీరిలీజ్ తో కొనసాగుతూ ఉంది. మహేష్ బాబు సినిమాలు ఒక్కడు, పోకిరి రీరిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగా పవన్ కళ్యాణ్ సినిమాలు ఖుషి, జల్సా, తమ్ముడు రీరిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేశాయి. రీరిలీజ్ కలెక్షన్స్ లో ఖుషి టాప్ ప్లేస్ నిలిచింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీరిలీజ్ చేయదగిన సినిమాలు దాదాపు ఇక లేవని, మహేష్ బాబు సినిమాలు బిజినెస్ మాన్, మురారి, వన్, అతడు, ఖలేజా వంటి సినిమాలు రీరిలీజ్ చేయదగిన సినిమాల జాబితాలో నిలుస్తాయని అంటున్నారు.

ఈ క్రమ్మలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి రీరిలీజ్ ద్వారా థియేటర్లలో హడావిడి చేసే ఛాన్స్ ఇక మీదట లేదని అంటున్నారు. రీరిలీజ్ అవుతున్న సినిమాల మాట పక్కన పెడితే, ఈ ట్రెండ్ పుణ్యమా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ పెరిగాయి. కలెక్షన్స్ విషయంలో ఎవరి సినిమాను వారు టాప్ ప్లేస్ లో నిలిచిందంటూ ప్రకటించుకొని ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటున్నారు.ఈ ట్రెండ్ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు