Actrees: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బాపు బొమ్మ?

పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో బాపు బొమ్మ గా పాపులర్ అయిన ప్రణీత సుభాష్ ప్రస్తుతం తెలుగు తెరకు కొంచెం దూరంగానే ఉంది. ఇక్కడ అన్నీ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్లే రావడంతో కన్నడ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేసింది. తెలుగులో చివరగా 2019 లో వచ్చిన “ఎన్టీఆర్ కథానాయకుడు”లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన ఈ భామ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. బహుశా ఆఫర్లు కూడా రాలేదు కావచ్చు.

అయితే కన్నడలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. నిజానికి బెంగుళూరు భామే కావడంతో అక్కడ ఎక్కువ ఛాన్సులు వచ్చి ఉండవచ్చు. అక్కడ స్టార్ హీరోలైన శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దర్శన్ లాంటి హీరోలతో సినిమాలు చేసింది. అయితే 2021లో ప్రముఖ బిజినెస్ మెన్ “నితిన్ రాజు” ను పెళ్లి చేసుకున్న ఈ భామ కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. 2022 లో ఒక పాపకు జన్మనిచ్చిన ప్రణీత మళ్ళీ సినిమాల్లోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకు సోషల్ మీడియా లో తెగ హల్చల్ చేస్తుంది ఈ భామ. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోషూట్ లు, తాను నటించిన సినిమాల పాటల స్టేటస్ లు పెడుతూ వైరల్ అవుతుంది. పైగా తెలుగు సినిమాల పాటలు ఎక్కువగా పెడుతుండడం విశేషం.

ఇప్పటికే కన్నడలో ఒకటి, మలయాళం లో ఒక సినిమా చేస్తుంది. మరి చక్కటి అందం, అభినయం తో పాటు మంచి టాలెంట్ కూడా ఉన్న ప్రణీత కు ఏ తెలుగు డైరెక్టరైనా ఛాన్స్ ఇవ్వకపోతాడా అని ఈ బాపు బొమ్మ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు