PMF: యంగ్ డైరెక్టర్ తో గొడవకు దిగిన శర్వానంద్- కొట్టుకునేంత వరకు వెళ్లిన వాగ్వాదం

యంగ్ హీరో శర్వానంద్ కి ఇటీవలనే పెళ్లి అయిన సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణ హై కోర్ట్ న్యాయవాది కూతురైన రక్షిత రెడ్డి – శర్వానంద్ ఇద్దరు ప్రేమించుకోగా, ఇటీవలనే పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జైపూర్ లోని లీల ప్యాలస్ లో పెళ్లి చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అవడం మూలాన ఈ పెళ్ళికి టాలీవుడ్ నుంచి మెగా ఫ్యామిలీ తప్ప ఎవరు అటెండ్ అవ్వలేదు. అయితే ఇటీవలనే హైదరాబాద్ లో కూడా వీళ్లా పెళ్లి రిసెప్షన్ ఫంక్షన్ ఏర్పాటు చేయగా సెలెబ్రెటీలంతా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇక పెళ్లి తరువాత ఈ యంగ్ హీరో హనీమూన్ వెళ్తాడేమో అనుకుంటే, అందరికి ఆశ్చర్య పరిచే విధంగా కొత్త పెళ్లి కొడుకు శర్వానంద్ తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కంప్లిట్ చేసే పనిలో పడ్డాడు. శర్వానంద్ పెళ్లి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో, అనుకున్న టైంకి రిలీజ్ కష్టమవుతోంది అనే ఉద్దేశ్యంతో శర్వానంద్ షూటింగ్ పూర్తి చేద్దామనుకున్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల ప్రతిష్టాత్మకంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విదేశాలలో కొంత షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్ ని ఇటీవలనే చూసిన శర్వానంద్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యపై సీరియస్ అయ్యాడంట, డైరెక్టర్ చెప్పిన కథకి, తయారైన సినిమాకి చాలా వరకు వైవిధ్యం రావడంతో శర్వానంద్ అసహనంగా ఉన్నడట. ఈ కారణంగా శర్వానంద్ సినిమాకి షూటింగ్ డేట్స్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదట. దాంతో యూనిట్ అంత అయోమయంలో పడ్డారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు