Rakshitha reddy: శర్వానంద్ తన భార్యకి ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా ?

టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి తెలియని వారు ఉండరు. గమ్యం అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకుని, టాలీవుడ్ లో మంచి యాక్టర్ గా ఎదిగిపోయాడు హీరో శర్వానంద్. ఇక ఆ తర్వాత….వరసహిట్లతో స్టార్ హీరోగా ఎరిగాడు. అయితే… తాజాగా టాలీవుడ్ హీరో శర్వానంద్ బ్యాచిలర్ జీవితానికి టాటా చెప్పి రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి వివాహ మహోత్సవం జైపూర్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక శర్వానంద్ కు రక్షిత రెడ్డి తల్లిదండ్రులు భారీ మొత్తంలోనే కట్న కానుకలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ. 20 కోట్ల రూపాయల నగదుతో పాటు, మూడు కేజీల బంగారం ఇచ్చినట్లు సమాచారం. .

అయితే శర్వానంద్, తన భార్య రక్షిత రెడ్డికి ఫస్ట్ నైట్ రోజునే… ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడట. రక్షిత రెడ్డికి బాగా నచ్చిన ఓ నెక్లెస్ ను ఫస్ట్ నైట్ రోజే హీరో శర్వానంద్ ఇచ్చాడని సమాచారం అందుతుంది. దీని కాస్ట్ దాదాపు కోటికి పైగా ఉందని కూడా చర్చ జరుగుతోంది. కాగా, టాలీవుడ్ హీరో శర్వానంద్ వివాహానికి మెగా కుటుంబం ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారట. హీరో శర్వానంద్ కు రామ్ చరణ్ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారని సమాచారం అందుతోంది

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు