తెలుగు చిత్ర పరిశ్రమను బేబీ సినిమా షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బేబీ సినిమా సక్సెస్ ఫుల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతోంది. హృదయ కాలేయం మరియు కొబ్బరిమట్ట సినిమాలు తీసిన దర్శకుడు సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో యంగ్ హీరో ఆనంద దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించారు.
అలాగే విరాజ్ అశ్విన్ కీలకపాత్రలో నటించి అందరినీ అలరించాడు. యూత్ మరియు లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిలకు ఈ సినిమా కనెక్ట్ అవుతుండటంతో ఆడియన్స్ నుంచి మంచి టాక్ వస్తుంది. మొదటి ప్రేమకు మరణం లేదు… మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది అంటూ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది.
అయితే థియేటర్లలో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ శ్రీ లీలాను అనుకున్నారట దర్శకుడు సాయి రాజేష్. శ్రీ లీల ప్రస్తుతం చాలా ప్రాజెక్టులు చేస్తోంది. దాంతో కథ కూడా వినకుండా ఆమె ఈ చిత్రానికి నో చెప్పిందట. శ్రీ లీల ఈ జనరేషన్ హీరోయిన్… పైగా ఇలాంటి ఒక క్రేజీ ఉన్న హీరోయిన్ అయితే మార్కెటింగ్ కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందని అనుకున్నాడట దర్శకుడు సాయి రాజేష్.
కానీ అది అసలు కుదరలేదు. చిన్న సినిమా అలాగే చిన్న బడ్జెట్ కాబట్టి శ్రీ లీలా కూడా నో చెప్పింది అట. ఈ తరుణంలోనే ఒక యూట్యూబర్ అయిన వైష్ణవి చైతన్యను హీరోయిన్గా రంగంలోకి దించాడు దర్శకుడు. దీంతో… హీరోయిన్ శ్రీ లీల మంచి సినిమాలు మిస్ చేసుకుందని… కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News