Chhatriwali: రకుల్ ని టాలీవుడ్ పక్కన పెట్టేసిందా?

రకుల్ ప్రీత్ సింగ్.. ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కెరటం అనే చిన్న సినిమా తో పరిచయమైన ఈ ఢిల్లీ భామ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో హిట్టు కొట్టింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు చేజిక్కించుని స్టార్ హీరోల సరసన నటించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోలందరితోనూ నటించి కొన్నాళ్ల పాటు నెంబర్ వన్ రేసులో కూడా నిలిచింది. చాలా మంది హీరోయిన్లకుండే ఆశే ఈమెకు పుట్టింది. అదే బాలీవుడ్ సినిమాల్లో స్టార్ అవ్వాలని.

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లైన చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ పై మోజుతో ఇక్కడ వచ్చిన ఆఫర్లని కాదని అక్కడ పాగా వేసి స్టార్ హీరోయిన్లు గా చక్రం తిప్పుదామని వెళ్లారు. కాజల్, తమన్నా, ఇలియానా వీళ్ళందరూ ఇదే కోవలోకి వస్తారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుదామని ఇక్కడ వచ్చే ఆఫర్లను రిజెక్ట్ చేసి మరీ వెళ్ళింది. తీరా చూస్తే అక్కడ ఆఫర్లు అయితే వచ్చాయిగాని ఒక్క హిట్టు కూడా రావడం లేదు. రీసెంట్ గా నటించిన రన్ వే34, థ్యాంక్ గాడ్, ఛత్రివాలి కూడా ప్లాప్ అవడంతో ఈ అమ్మడి కెరీర్ గందరగోళంగా తయారయింది.

ఇప్పుడు టాలీవుడ్ కి వద్దామన్న ఆఫర్లు లేవు. లేటెస్ట్ గా వచ్చిన హీరోయిన్లు తన ప్లేస్ ని కబ్జా చేయడంతో స్టార్ హీరోలతోనే కాదు, చిన్న హీరోల సరసనా ఆఫర్లు రావడం లేదు. బాలీవుడ్ మీద ఆశతో లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ని కాదని వెళ్ళింది. అందుకే తెలుగు దర్శక నిర్మాతలు పక్కన పెట్టేశారని టాక్. మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొద్దామని అనుకున్నా టాలీవుడ్ దర్శకులు ఛాన్సులు ఇస్తారా అంటే డౌటే అనాలి. అయితే పెద్ద పెద్ద బ్యానర్ లలో రకుల్ నటించడం వల్ల, ఆ చనువుతో బహుశా ఎవరైనా స్టార్ ప్రొడ్యూసర్లు తీసే చిన్న సినిమాల్లో అయినా ఆఫర్ రావొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు