Tollywood: మళ్ళీ టాలీవుడ్ వైపు ఆ హీరోయిన్ చూపు..!

ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమై టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది తాప్సి. కెరీర్ ఆరంభం నుండి గ్లామర్ ప్రధాన పాత్రలకే పరిమితం అయిన తాప్సి టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ హిట్ అందక పోవటంతో బాలీవుడ్ కి తన మకాం మార్చింది. అక్కడ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ పింక్ వంటి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అయితే, గతంలో దక్షిణాది సినిమాలని తక్కువ చేస్తూ స్ట్మెంట్స్ ఇచ్చి ఆడియెన్స్ అగరహానికి గురైంది తాప్సి. ఆ సమయంలో సోషల్ మీడియాలో సౌత్ ఆడియెన్స్ నుండి తీవ్ర వ్యతిరేకతను చవి చూసింది తాప్సి.
చాలా కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉంటున్న తాప్సి ఇప్పుడు టాలీవుడ్ చూస్తోంది అంటూ వార్తలొస్తున్నాయి. తెలుగు ఆడియెన్స్ దాదాపు తాప్సిని మరిచిపోయే స్టేజ్ కి వచ్చారు. ఈ తరుణంలో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న తాప్సిని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. అప్పట్లో తాప్సి సౌత్ సినిమా అంటూ కామెంట్స్ చేసినప్పటికీ ఆ వ్యాఖ్యల అంతరార్థం టాలీవుడ్ సినిమా మాత్రమే అన్న సంకేతాలు వచ్చాయి ఎందుకంటే తాప్సి దక్షిణాది భాషల్లో తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయటం ఇందుకు కారణం. మరో సందర్భంలో ఝుమ్మంది నాదం లోని ఒక పాటు తాలూకు అనుభవాన్ని ప్రస్తావిస్తూ రాఘవేందర్ రావు లాంటి దర్శక దిగ్గజాన్ని చులకన చేసే విధంగా కామెంట్స్ చేసింది.
శ్రీలీల వంటి యంగ్ హీరోయిన్స్ వరుస హిట్స్ తో తమ సత్తా చాటుతున్న నేపథ్యంలో తాప్సి టాలీవుడ్ రీఎంట్రీ అంత గ్రాండ్ గా ఉండకపోవచ్చు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయికి టాలీవుడ్ విస్తరించిన క్రమంలో మంచి అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉన్న తాప్సి గతంలో చేసిన కామెంట్స్ ఆమెకి అడ్డుకట్ట వేసేలా ఉన్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు