టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి.. ఈ హీరోయిన్ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, అభినయంతో కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో 17 సంవత్సరాలుగా హీరోయిన్ గా కొనసాగుతోంది.
2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది అనుష్క. ఇక ఆ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా తన ప్రత్యేకతను చాటుకుంది. కానీ ఈ మధ్యకాలంలో అంతగా అవకాశాలు లేక అరకొర సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఒకానొక సందర్భంలో ఈమెకు సినిమాలే లేవు..
ఆమె సినీ కెరీర్ ముగిసినట్లేనని అనుకునే సమయంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ” మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లికి సంబంధించి ఎలాంటి న్యూస్ చెప్పడం లేదు ఈ స్వీటీ. ఇదిలా ఉంటే తాజాగా అనుష్కకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్క ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుండి సుమారు 500 నుండి 700 కోట్ల వరకు ఆస్తులను వెనకేసుకొచ్చిందట. అయితే ఇండస్ట్రీలోకి రాక ముందు పెద్దగా ఆస్తులు లేని స్వీటీ.. ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా ఆస్తులను వెనకేసుకుందట. కేవలం సినిమాలలోనే కాకుండా అక్కినేని నాగార్జునతో కలిసి పలు బిజినెస్ లు కూడా స్టార్ట్ చేసిందట. అవి మంచి సక్సెస్ కావడంతో ఇన్వెస్ట్ చేసిన దానికంటే డబుల్ రేంజ్ లో మనీ సంపాదించి ఆస్తులను కూడబెట్టిందట. ప్రస్తుతం అనుష్క దగ్గర నాలుగు కాస్ట్లీ కార్లు, హైదరాబాద్ – కర్ణాటక – వైజాగ్ లలో పలు ప్రాపర్టీస్, ఇల్లులు ఉన్నాయని తెలుస్తోంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News