Bhumika Chawla: ఆ రెండు సినిమాల నుంచి తీసేశారు

భూమిక చావ్లా.. సుమంత్ నటించిన ‘యువకుడు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు ఆగ్ర హీరోల సరసన మెరిసింది. ఖుషి తర్వాత కూడా ఒక్కడు, సింహాద్రి, సాంబ, వాసు లాంటి సినిమాలు చేసింది భూమిక. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా కూడా భూమిక మాత్రం ఖుషి హీరోయిన్ గానే గుర్తుపెట్టుకున్నారు ప్రేక్షకులు. ఖుషితో పాటు తక్కువ సమయంలోనే మహేష్ బాబుతో ఒక్కడు, ఎన్టీఆర్ తో సింహాద్రి లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా అందుకుంది భూమిక. ఆయా హీరోలకు కథానాయకులుగా ఏడవ చిత్రం కావడం విశేషం.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఏడవ చిత్రంలో భూమిక కథానాయిక కావడం అవన్నీ సూపర్ హిట్ అవడం విశేషంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. ఆ తర్వాత అక్కడ పలు సినిమాల్లో నటించింది. అక్కడి నుంచి మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భూమిక చిన్న చిన్న పాత్రలు చేస్తూ వస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భూమిక ఆసక్తికర కామెంట్ చేశారు. బాలీవుడ్ లో తాను చేయాల్సిన రెండు సినిమాలు మిస్ అయ్యాయని, అవి చేసి ఉంటే నేను నెక్స్ట్ లెవెల్ లో ఉండేదాన్ని అంటున్నారు భూమిక. హీరోయిన్ గా ఎంపిక చేసిన తర్వాత అనూహ్యంగా తొలగించారని చెప్పుకొచ్చారు భూమిక. తేరే నామ్ తర్వాత ఓ పెద్ద సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని, అలాగే జబ్ వి మెట్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. కానీ తనను ఆ సినిమాల నుంచి తప్పించారు అని చెప్పుకొచ్చారు. భూమిక ఆ సినిమాలు చేసి ఉండుంటే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించేది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు