Bollywood: బాలీవుడ్ అగ్ర నటుడికి షూటింగ్ లో ప్రమాదం

బాలీవుడ్ అగ్ర నటుడు మరియు చిత్ర నిర్మాణ అయిన అక్షయ్ కుమార్ గురించి తెలియని వారుండరు. ఈయన అత్యంత పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు. అంతే కాక బాలీవుడ్ లో ఏడాదికి నాలుగు సినిమాలు చేసే ఏకైక స్టార్ హీరో. ఇటీవల డల్లాస్ లో జరిగిన ఒక ఈవెంట్ లో నోరా ఫతేహి తో కలిసి ‘ఊ అంటావా’ పాట కి పెర్ఫార్మ్ చేసారు. ఐతే ఈ డ్యాన్స్ పై చాలానే ట్రోల్స్ వచ్ఛాయి.

ఇక ఈయన చివరి చిత్రం ‘సెల్ఫీ’ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ప్రస్తుతం ‘చోటే మియా బడే మియా’ అనే మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా లో అక్షయ్ కుమార్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ స్కాట్లాండ్‌లో జరుగుతున్న సమయం లో ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో అక్షయ్ కుమార్ మొకాలికి గాయం అయింది.

అయితే డాక్టర్ని సంప్రదించగా, పెద్ద గాయాలు ఏమి లేవు, భయపడాల్సిన పని లేదు కానీ కొన్ని రోజులు యాక్షన్ సీన్స్ కి దూరం గా ఉంటే సరిపోతుంది అని చెప్పారట. దీనితో అక్షయ్ కుమార్ ప్రస్తుతం మాములుగా నటీ నటుల తో కలిసి షూట్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు